ఓటరు జాబితాను సవరించాలి
● మున్సిపల్ కమిషనర్లకు నాయకుల వినతి
నర్సంపేట: ఓటరు జాబితాలో జరిగిన అవకతవకలను సవరించాలని రాజకీయ పార్టీల నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు నర్సంపేట మున్సిపాలిటీ కార్యాలయంలో కమిషనర్ భాస్కర్కు అన్ని రాజకీయ పార్టీల నాయకులతో సోమవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ జిల్లాలోని ఇతర ప్రాంతాలకు చెందిన వారిని కూడా బోగస్ ఓట్లు నమో దు చేశారని, వీటిన్నింటిని పరిశీలించి పారదర్శకంగా ఓటరు జాబితాను రూపొందించాలని డిమాండ్ చేశారు. అనంతరం మున్సిపల్ కమిషనర్కు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు నాగెల్లి వెంకటనారాయణగౌడ్, పంజాల రమేష్, ఎస్కె.జావిద్, మేరుగు శివకోటి, గూడూరు సందీప్, బైరి మురళి, తదితరులు పాల్గొన్నారు.
ఎన్నికలు బహిష్కరిస్తాం
వర్ధన్నపేట: వంద పడకల ఆస్పత్రిని వర్ధన్నపేట పట్టణంలోనే నిర్మించాలని లేదంటే రాబోయే మున్సిపల్ ఎన్నికలు పట్టణ ప్రజలు బహిష్కరిస్తారని అఖిల పక్ష నాయకులు స్పష్టం చేశారు. సోమవారం వర్ధన్నపేట మున్సిపల్ కమిషనర్కు వందపడకల ఆస్పత్రి పట్టణంలోనే నిర్మాంచాలని కోరుతూ వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా అఖిల పక్ష పార్టీల నాయకులు మాట్లాడుతూ వర్ధన్నపేట పట్టణానికి వంద పడకల ఆస్పత్రి అప్గ్రేడ్ అయి మంజూరు కాగా ఆ ఆస్పత్రిని ఉప్పరపల్లి క్రాస్ రోడ్డు వద్దకు మారుస్తామని గతంలో ప్రకటన చేశారని దానిని ఉపసంహరించుకుని వర్ధన్నపేట పట్టణంలోని ఆస్పత్రి స్థలంలోనే నిర్మించే విధంగా చూడాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అఖిల పక్షం నాయకులు మైస సురేష్, తుమ్మల యాకయ్య, కొండేటి సత్యం, పెద్దూరి రాజ్కుమార్, సిలువేరు కుమారస్వామి, గోధుమల మధుసూధన్, మైస రాము, కొండేటి శ్రీనివాస్, హన్మకొండ సుధాకర్, తుమ్మల రవీందర్, సిలువేరు శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.


