 
															శంషాబాద్ ఎయిర్పోర్ట్కు ఆర్టీసీ బస్సు సౌకర్యం
హన్మకొండ : హైదరాబాద్లోని శంషాబాద్ ఎయిర్పోర్ట్కు ఆర్టీసీ రాజధాని ఏసీ బస్సు సౌకర్యాన్ని కల్పించింది. ప్రతిరోజు హనుమకొండ జిల్లా బస్ స్టేషన్ నుంచి సాయంత్రం 4గంటలకు బయలుదేరి రాత్రి 7:30 రాజీవ్గాంధీ అంతర్జాతీయ ఎయిర్పోర్ట్కు చేరుకుంటుంది. తిరిగి ఉదయం 5గంటలకు శంషాబాద్ ఎయిర్పోర్ట్లో బయలుదేరి ఉప్పల్ మీదుగా హనుమకొండ, భూపాలపల్లికి వెళ్తుంది. హనుమకొండ–శంషాబాద్ ఎయిర్పోర్ట్కు చార్జీ రూ.700 లుగా నిర్ణయించారు. బస్సును సోమవారం ప్రారంభించినట్లు వరంగల్–1 డిపో మేనేజర్ అర్పిత తెలిపారు. ఆర్టీసీ వెబ్సైట్లో ముందస్తు రిజర్వేషన్ చేసుకోవచ్చని పేర్కొన్నారు.
హన్మకొండ అర్బన్ : కపాస్ కిసాన్ యాప్ ద్వారా ప్రస్తుతం పత్తి కొనుగోళ్లకు స్లాట్ బుకింగ్ జరుగుతుందని కలెక్టర్ స్నేహశబరీష్ వివరించారు. సోమవారం హైదరాబాద్ నుంచి మంత్రులు ఉత్తమ్కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, సీఎస్ కె.రామకృష్ణారావుతో కలిసి పత్తి, ధాన్యం, మొక్కజొన్న పంటల కొనుగోళ్లు, తుఫాన్ నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల పై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్లతో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి కలెక్టరేట్ నుంచి కలెక్టర్ స్నేహశబరీష్ హాజరైన మాట్లాడారు. ప్రతి గ్రామంలో వ్యవసాయ విస్తరణ అధికారుల ద్వారా రైతుల మొబైల్ నంబర్ సేకరించి షెడ్యూల్ ప్రకారం పత్తి కొనుగోలు అయ్యేలా చూస్తున్నామని అన్నారు. కపాస్ కిసాన్ యాప్ లో కౌలు రైతుల వివరాలను ప్రత్యేకంగా నమోదు చేసేందుకు వ్యవసాయ విస్తరణ అధికారుల లాగిన్లో అవకాశం కల్పించామన్నారు. సమావేశంలో డీఆర్డీఓ మేన శ్రీను, డీసీఓ సంజీవరెడ్డి, డీపీఓ రవీంద్రసింగ్, సంబంధిత జిల్లా అధికారులు పాల్గొన్నారు.
హన్మకొండ అర్బన్ : ఉద్యోగ, ఉపాధ్యాయులకు రిటైర్డ్మెంట్ బెనిఫిట్స్ బకాయిలను వెంటనే చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల అసోసియేషన్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు నరసింహారెడ్డి డిమాండ్ చేశారు. రాష్ట్ర అసోసియేషన్ పిలుపు మేరకు సోమవారం నాయకులు, పెన్షనర్లతో కలిసి హనుమకొండ కలెక్టరేట్ ఎదుట నిరసన ప్రదర్శన, ధర్నా నిర్వహించారు. అనంతరం కలెక్టర్ స్నేహ శబరీష్ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా నరసింహారెడ్డి మాట్లాడుతూ.. 2024 మార్చి నుంచి 2025 సెప్టెంబర్ వరకు ఉద్యోగ, ఉపాధ్యాయులకు పెన్షన్ తప్ప ఎలాంటి ప్రయోజనాలు అందలేదని విమర్శించారు. కార్యక్రమంలో రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు వీరస్వామి, హనుమకొండ ఎస్టీఓ యూనిట్ జనరల్ సెక్రెటరీ కందుకూరి దేవదాసు, టీపీటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి రావుల రమేశ్, చింతగట్టు క్యాంపు అధ్యక్షుడు వెంకటేశ్వర్లు, శ్యాం సుందర్ రెడ్డి, భీమదేవరపల్లి కమిటీ బాధ్యులు రాజిరెడ్డి, లింగారెడ్డి, జిల్లా కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
 
							శంషాబాద్ ఎయిర్పోర్ట్కు ఆర్టీసీ బస్సు సౌకర్యం
 
							శంషాబాద్ ఎయిర్పోర్ట్కు ఆర్టీసీ బస్సు సౌకర్యం

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
