
ఎయిడ్స్ పరీక్షలు తప్పనిసరి
● డీఎంహెచ్ఓ సాంబశివరావు
ఎంజీఎం: గర్భిణులు అన్ని పరీక్షలతోపాటు ఎయిడ్స్ పరీక్షలు తప్పనిసరిగా చేయించుకోవాలని, ప్రసవానికి ముందు 9వ నెలలో ఎయిడ్స్ పరీక్షలు చేయించుకుంటే మంచి ఫలితాలు ఉంటాయని జిల్లా వైద్యాధికారి సాంబశివరావు సూచించారు. ఐఎంఏ హాల్లో డీడబ్ల్యూఓ రాజమణి అధ్యక్షతన డిస్ట్రిక్ట్ ఎయిడ్స్ ప్రివెన్షన్, కంట్రోల్ యూనిట్ ఆధ్వర్యంలో అంగన్వాడీ టీచర్లు, సూపర్వైజర్లకు అవగాహన, శిక్షణ కార్యక్రమం మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్ఓ మాట్లాడుతూ ఎయిడ్స్ అంటు వ్యాధి కాదని, ఎయిడ్స్ నివారణకు ప్రతిఒక్కరూ జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ఎంజీఎం, నర్సంపేట, వర్ధన్నపేట ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఎయిడ్స్ నిర్దారణ పరీక్షలు చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో డీడబ్ల్యూఓ ప్రోగ్రాం అధికారి డాక్టర్ మోహన్సింగ్, డిస్ట్రిక్ట్ ప్రోగ్రాం మేనేజర్ స్వప్నమాధురి, డిప్యూటీ డెమో అనిల్కుమార్, ఐసీటీసీ సూపర్వైజర్ రామకృష్ణ, అసిస్టెంట్ అకౌంటెంట్ కమలాకర్ పాల్గొన్నారు.
ఆరోగ్యంపై శ్రద్ద వహించాలి
ఖానాపురం: విద్యార్థులు ఆరోగ్యంపై శ్రద్ద చూపాలని డీఎంహెచ్ఓ సాంబశివరావు అన్నారు. అశోక్నగర్ కేజీబీవీలో మంగళవారం వైద్యశిబిరాన్ని నిర్వహించారు. వైద్యశిబిరాన్ని డీఎంహెచ్ఓ సాంబశివరావు సందర్శించి రికార్డులు, మధ్యాహ్న భోజనంతోపాటు కూరగాయలు పరిశీలించారు. పల్లె దవాఖానా వైద్యురాలు కల్పన, ఆర్బీఎస్కే డాక్టర్ రవీందర్, హెల్త్ సూపర్వైజర్ దామోదర్రెడ్డి, ల్యాబ్ టెక్నీషియన్ నవీన్, ఎన్సీడీ నర్సింగ్ ఆఫీసర్ సబిత, సిబ్బంది రమాదేవి, రమ్య, దివ్య, అన్నపూర్ణ, ప్రిన్సిపాల్ మేనక పాల్గొన్నారు.