‘గ్రేటర్‌’ గాడిన పడేనా..? | - | Sakshi
Sakshi News home page

‘గ్రేటర్‌’ గాడిన పడేనా..?

Jun 14 2025 6:38 AM | Updated on Jun 14 2025 6:38 AM

‘గ్రే

‘గ్రేటర్‌’ గాడిన పడేనా..?

సాక్షిప్రతినిధి, వరంగల్‌:

ల్దియా కొత్త కమిషనర్‌ చాహత్‌ బాజ్‌పాయ్‌కి సొంత విభాగంలో పలు సమస్యలు స్వాగతం పలుకుతున్నాయి. ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలు, రెండు కలెక్టరేట్ల పరిధిలో విస్తరించి ఉన్న గ్రేటర్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (జీడబ్ల్యూఎంసీ), కాకతీయ అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (కుడా)ల ద్వారా అభివృద్ధి పనుల కోసం రూ.కోట్లు ఖర్చు చేస్తున్నా.. క్షేత్రస్థాయిలో కొన్ని విభాగాల్లో కోరలు చాస్తున్న అవినీతి, అక్రమాల వల్ల చెడ్డ పేరు వస్తోంది. పార్కులు, చెరువులు, నాలాల ఆక్రమణలు.. అక్రమ నిర్మాణాలు నగరంలో విచ్చలవిడిగా సాగుతున్నా ఎవరికీ పట్టడం లేదు. భవన నిర్మాణదారుల సంఘం ఏకంగా సీఎం పేషీలోనే ఫిర్యాదు చేసింది. కార్పొరేషన్‌కు చెందిన ఓ కీలక ప్రజాప్రతినిధిని ఒప్పించి కాంట్రాక్టర్ల సిండికేట్‌కు ఎక్సెస్‌ టెండర్‌పై పనులు దక్కేలా ఇంజనీరింగ్‌ విభాగంలో కొందరు చక్రం తిప్పుతుండడం వివాదాస్పదమైంది. ఇదే సమయంలో జీడబ్ల్యూఎంసీ కమిషనర్‌తోపాటు ‘కుడా’ వైస్‌ చైర్మన్‌గా ఉన్న అశ్విని తానాజీ వాకడేపై బదిలీ వేటు పడడం చర్చనీయాంశంగా మారింది. కొత్తగా శుక్రవారం బాధ్యతలు చేపట్టిన చాహత్‌ బాజ్‌పాయ్‌ బల్దియాపై ప్రత్యేక దృష్టి సారిస్తేనే పాలన గాడిన పడుతుందన్న చర్చ సర్వత్రా జరుగుతోంది.

ఎక్కడికెళ్లినా తిరిగి ఇక్కడికే..

జీడబ్ల్యూఎంసీలో పని చేయడానికి అలవాటు పడిన అధికారులు ఎక్కడికి వెళ్లినా కొద్దిరోజులే. ఆరు నెలల నుంచి ఏడాది వ్యవధిలో మళ్లీ ‘బల్దియా’కే వస్తున్నారు. ప్రస్తుతం జీడబ్ల్యూఎంసీలో ఓ విభాగానికి కీలకాధికారిగా ఉన్న ఒకరు అతడి పదవికి ముప్పు వస్తుందంటే చాలు.. పాదరసంలా పా వులు కదుపుతారు. ఈ టాలెంట్‌తోనే 22 నెలల కిందటి వరకు ఏడాదికోసారి రెన్యువల్‌ చేయించుకుని నాలుగేళ్లు గడిపిన ఆయన.. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలో కొద్ది రోజులు పని చేశారు. పదోన్నతిపై ఆయన తిరిగి 2024 అక్టోబర్‌ చివరి వారంలో ‘రాజా’లా బల్దియాలోని కీలకపోస్టులో చేరారు.

● జూనియర్‌ అసిస్టెంట్‌గా చేరి ట్యాక్స్‌ ఆఫీసర్‌ స్థాయి వరకు ఎదిగిన మరో అధికారి సైతం ‘బల్దియా’ను వదల అన్నారు. ఎన్నికల నిబంధనల మేరకు ట్యాక్స్‌ ఆఫీసర్‌గా వర్ధన్నపేట మున్సిపాలిటీకి బదిలీపై వెళ్లిన ఆయన తిరిగి ఐదు రోజుల కిందటే మళ్లీ వరంగల్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌లో కీలక పదవిలో చేరారు. వీరితోపాటు మరికొందరు ఇక్కడే తిష్టవేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

అవినీతి ఆరోపణల్లో పలు విభాగాలు..

ఇంజినీరింగ్‌, టౌన్‌ప్లానింగ్‌, శానిటేషన్‌, రెవెన్యూ తదితర శాఖలపై అవినీతి ఆరోపణలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఏకంగా మున్సిపల్‌ కమిషనర్‌ స్థాయి అధికారిని సైతం మెప్పించి పనులు కానిచ్చారన్న ఫిర్యాదులున్నాయి. వరంగల్‌ నగరం చుట్టూ విచ్చలవిడిగా ఏర్పాటవుతున్న రియల్‌ ఎస్టేట్‌ వెంచర్లు, నాన్‌ లేఅవుట్‌ ప్లాట్లను ‘మామూలు’గా తీసుకుంటున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఆరు నెలల వ్యవధిలో ఇంజనీరింగ్‌ విభాగం ద్వారా నిర్వహించిన సుమారు రూ.314 కోట్ల ఈ–ప్రొక్యూర్‌మెంట్‌ టెండర్లలోనూ కాంట్రాక్టర్లను మిలాఖత్‌ చేసి 4.99 శాతం ఎక్సెస్‌ టెండర్‌ పనులు దక్కేలా చక్రం తిప్పారన్న ఆరోపణలు ఉన్నాయి.

బల్దియా కమిషనర్‌గా బాధ్యతలు

స్వీకరిస్తున్న చాహత్‌ బాజ్‌ పాయ్‌

కొత్త కమిషనర్‌ చాహత్‌ బాజ్‌పాయ్‌ కొరడా ఝుళిపించాల్సిందే..

జీడబ్ల్యూఎంసీ, ‘కుడా’లలో

ఇష్టారాజ్యం.. పలు విభాగాలపై అవినీతి ఆరోపణలు

బల్దియాలో ఏళ్ల తరబడిగా అధికారుల తిష్ట

ఎక్కడికి బదిలీ చేసినా

పదోన్నతులపై ఇక్కడికే..

నగరాభివృద్ధికి సమష్టి కృషి చేద్దాం

అధికారులకు పిలుపునిచ్చిన

కమిషనర్‌ చాహత్‌ బాజ్‌ పాయ్‌

వరంగల్‌ అర్బన్‌: నగరాభివృద్ధికి అధికారులంతా సమష్టిగా కృషి చేయాలని గ్రేటర్‌ కమిషనర్‌ చాహాత్‌ బాజ్‌ పేయి పిలుపునిచ్చారు. శుక్రవారం గ్రేటర్‌ వరంగల్‌ మునిపల్‌ కార్పొరేషన్‌ (జీడబ్ల్యూఎంసీ) కమిషనర్‌గా చాహాత్‌ బాజ్‌ పేయి ప్రధాన కార్యాలయంలో ఉద్యోగ బాధ్యతలు స్వీకరించారు. ఈసందర్భంగా వివిధ విభాగాలకు చెందిన ఉన్నతాధికారులు, సిబ్బంది కమిషనర్‌ను కలిసి పుష్పగుచ్ఛాలు, పూల మొక్కలు అందజేశారు. అనంతరం జరిగిన పరిచయ కార్యక్రమంలో కమిషనర్‌ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పథకాలను ప్రజలకు చేరువ చేస్తానని, కరీంనగర్‌లో మున్సిపల్‌ కమిషనర్‌గా కరీంనగర్‌ కార్పొరేషన్‌లో పనిచేసిన అనుభవం ఉందని మున్సిపల్‌ సర్వీసులపై అవగాహన ఉందని స్పష్టం చేశారు. శానిటేషన్‌పై ప్రత్యేక దృష్టి సారించి నగర పరిశుభ్రతకు కృషి చేయాలన్నారు.

‘గ్రేటర్‌’ గాడిన పడేనా..?1
1/1

‘గ్రేటర్‌’ గాడిన పడేనా..?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement