
ఉత్సాహంగా 5కే రన్
ఎంజీఎం: నేషనల్ సర్జన్స్ డేను పురస్కరించుకొని ఏఎస్ఐ వరంగల్ బ్రాంచ్ ఐఎంఏ వరంగల్ డిపార్టమెంట్ ఆఫ్ సర్జరీ, కేఎంసీ ఎన్ఎస్ఎస్ యూనిట్ ఆధ్వర్యాన గురువారం కేఎంసీ నుంచి ఐఎంఏ హాల్ వరకు 5కే రన్ నిర్వహించారు. ఏఎస్ఐ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ మోహన్దాస్, ఐఎంఏ వరంగల్ అధ్యక్షుడు డాక్టర్ నాగార్జునరెడ్డి జెండా ఊపి రన్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏఎస్ఐ ప్రధాన కార్యదర్శి కూరపాటి రమేశ్ మాట్లాడుతూ ఈ రన్ ద్వారా ప్రజల్లో ఆరోగ్యంపై అవగాహన పెంపొందించడమే కాకుండా సర్జన్ల పాత్రను సమాజానికి వివరిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో సర్జన్ డాక్టర్లు శ్రీనివాస్గౌడ్, నాగేందర్, విద్యాసాగర్, రూప, కార్తీక్, కేఎంసీ ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్, పీజీ, నర్సింగ్ విద్యార్థులు పాల్గొన్నారు.