జల దోపిడీపై రైతులు చైతన్యం కావాలి | - | Sakshi
Sakshi News home page

జల దోపిడీపై రైతులు చైతన్యం కావాలి

Jun 13 2025 4:37 AM | Updated on Jun 13 2025 4:37 AM

జల దోపిడీపై రైతులు చైతన్యం కావాలి

జల దోపిడీపై రైతులు చైతన్యం కావాలి

మాజీ ఎమ్మెల్యే

పెద్ది సుదర్శన్‌రెడ్డి

నర్సంపేట: రాష్ట్రంలో జరుగుతున్న జల దోపిడీపై ప్రజలు, రైతులు చైతన్యం కావాలని నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి కోరారు. ఈ మేరకు పార్టీ ముఖ్య నాయకులతో గురువారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్‌లోని ప్రాజెక్టులకు సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వం సహకరిస్తోందని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై రేవంత్‌రెడ్డి బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. కేంద్రంతో కలిసి తెలంగాణలోని ప్రధాన సాగునీటి ప్రాజెక్టులను ఎండబెట్టే ప్రయత్నం జరుగుతోందని పేర్కొన్నారు. జిల్లాను సస్యశ్యామలం చేసే దేవాదుల, సీతారామ, రామప్ప–పాకాల, రంగాయ చెరువు లాంటి ప్రధాన ప్రాజెక్టులను విస్మరిస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్‌ను బుధవారం ఘోష్‌ కమిషన్‌ ముందుకు పిలిపించి రాక్షసానందం పొందిన కాంగ్రెస్‌ ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు. ఆరు గ్యారంటీలు అమలు చేయలేక కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు, మంత్రులు, ప్రజాప్రతినిధులు ప్రజలకు దూరంగా తప్పించుకు తిరుగుతున్నారని ఆరోపించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వానికి స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించే దమ్ము లేదని తెలిపారు. గ్రామాలు, పట్టణాల్లో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేసిన అభివృద్ధి మాత్రమే కనిపిస్తోందని, ఎప్పుడు ఎన్నికలు జరిగినా పార్టీ విజయం సాధిస్తుందని పెద్ది ధీమా వ్యక్తం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement