ప్రథమ చికిత్స కేంద్రంలో తనిఖీలు | - | Sakshi
Sakshi News home page

ప్రథమ చికిత్స కేంద్రంలో తనిఖీలు

Jun 12 2025 3:01 AM | Updated on Jun 12 2025 3:01 AM

ప్రథమ చికిత్స కేంద్రంలో తనిఖీలు

ప్రథమ చికిత్స కేంద్రంలో తనిఖీలు

ఎల్కతుర్తి: భీమదేవరపల్లి మండలం కొప్పూర్‌ గ్రామంలోని ఆర్‌ఎంపీ ప్రథమ చికిత్స కేంద్రంలో అధికారులు బుధవారం సాయంత్ర తనిఖీలు చేశారు. గ్రామానికి చెందిన ఆర్‌ఎంపీ విలాసాగరం శ్రీనివాస్‌ ప్రథమ చికిత్స కేంద్రంలో అనుమతి లేకుండా మందులు నిల్వ ఉంచినట్లు డ్రగ్స్‌ కంట్రోల్‌ అధికారి కిరణ్‌ తెలిపారు. తనిఖీల్లో రూ.ఒక లక్ష విలువైన 71 రకాల మందులు స్వాధీనం చేసుకుని, ఆర్‌ఎంపీకి షోకాజ్‌ నోటీసులు జారీ చేసినట్లు వివరించారు. ఆయన నుంచి సంతృప్తికరమైన సమాధానం రాకుంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనుమతి, అర్హత లేకుండా ఆర్‌ఎంపీలు మందులను విక్రయిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని అధికారి కిరణ్‌ స్పష్టం చేశారు. ఆర్‌ఎంపీ ప్రథమ చికిత్స కేంద్రంలో తనిఖీల్లో డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్లు పావని, బాలకృష్ణ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement