
రైతులకు వెంటనే పరిహారం చెల్లించాలి
కలెక్టర్ ప్రావీణ్య
హన్మకొండ అర్బన్: భూసేకరణ పూర్తయిన రైతులకు వెంటనే పరిహారం అందించాలని హనుమకొండ కలెక్టర్ ప్రావీణ్య అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లో అదనపు కలెక్టర్ వెంకట్రెడ్డితో కలిసి భీమదేవరపల్లి, వేలేరు మండలాల పరిధిలో గౌరవెల్లి ప్రాజెక్టు, పరకాల నియోజకవర్గ పరిధిలో గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే ప్రాజెక్ట్, జిల్లాలో వివిధ రైల్వే ప్రాజెక్టుల భూసేకరణ ప్రక్రియ, రైతులకు పరిహారం చెల్లింపు, భూసేకరణ పురోగతి అంశాలపై నేషనల్ హైవే అధికారులు, రెవెన్యూ అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ.. ప్రాజెక్టులకు సంబంధించి భూసేకరణ ప్రక్రియను వేగవంతంగా పూర్తయ్యేలా అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. ఆలస్యం చేయకుండా సంబంధిత రైతులకు పరిహారం చెల్లించాలన్నారు. సమావేశంలో హనుమకొండ, పరకాల ఆర్డీఓలు రాథోడ్ రమేశ్, డాక్టర్ నారాయణ, గౌరవెల్లి ప్రాజెక్టు డీఈ చైతన్య, నేషనల్ హైవే, రెవెన్యూ శాఖల అధికారులు పాల్గొన్నారు.
భూభారతి దరఖాస్తుల పరిష్కారానికి చర్యలు
జిల్లా వ్యాప్తంగా నిర్వహిస్తున్న భూ భారతి రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన దరఖాస్తుల సత్వర పరిష్కారా నికి చర్యలు చేపట్టాలని కలెక్టర్ ప్రావీణ్య అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లో జిల్లాలోని ఆయా మండలాల్లో జరుగుతున్న రెవె న్యూ సదస్సుల నిర్వహణ, వచ్చిన దరఖాస్తుల పరి ష్కారంపై ఆర్డీఓలు, తహసీల్దార్లతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ వెంకట్రెడ్డి, భూ కొలతల శాఖ ఏడీ శ్రీనివాసులు, హనుమకొండ, పరకాల ఆర్డీఓలు రాథోడ్ రమేశ్, నారాయణ, తహసీల్దార్లు పాల్గొన్నారు.
సఖి భవన ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలి
కాజీపేట అర్బన్: హనుమకొండ లష్కర్బజార్లో నూతనంగా నిర్మించిన సఖి కేంద్ర భవనాన్ని త్వరలో ప్రారంభించేందుకు సిద్ధం చేయాలని కలెక్టర్ ప్రావీణ్య అన్నారు. ఆనూతన భవనాన్ని మంగళవారం కలెక్టర్ పరిశీలించారు. కార్యక్రమంలో జిల్లా సీ్త్ర, శిశు సంక్షేమాధికారి జయంతి, ఆర్అండ్బీ ఈఈ సురేశ్బాబు, సఖి కేంద్ర కో–ఆర్డినేటర్ హైమావతి, డీఈ గోపీకృష్ణ పాల్గొన్నారు.