సైన్స్‌ కోర్సుల అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా శ్రీనివాస్‌ | - | Sakshi
Sakshi News home page

సైన్స్‌ కోర్సుల అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా శ్రీనివాస్‌

Jun 10 2025 3:32 AM | Updated on Jun 10 2025 3:32 AM

సైన్స

సైన్స్‌ కోర్సుల అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా శ్రీనివాస్‌

కేయూ క్యాంపస్‌: కాకతీయ యూనివర్సిటీ పరిధి సెంటర్‌ ఫర్‌ డిస్టెన్స్‌ ఆన్‌లైన్‌ ఎడ్యుకేషన్‌ (సీడీఓఈ) సైన్స్‌ కోర్సుల అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా మైక్రోబయాలజీ విభాగం అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ ముంజం శ్రీనివాస్‌ను నియమిస్తూ సోమవారం రిజిస్ట్రార్‌ రామచంద్రం ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటివరకు ఆ పదవిలో ఉన్న వెంకటగోిపీనాథ్‌ ఏడాది గడువు ముగియడంతో ముంజం శ్రీనివాస్‌ను నియమించారు. ప్రస్తుతం శ్రీనివాస్‌ మైక్రోబయాలజీ బోర్డ్‌ ఆఫ్‌ స్టడీస్‌ చైర్మన్‌గా కూడా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

నిట్‌ ఓపెన్‌ హౌస్‌కు

అనూహ్య స్పందన

కాజీపేట అర్బన్‌: నిట్‌ వరంగల్‌లోని అంబేడ్కర్‌ లెర్నింగ్‌ సెంటర్‌ ఆడిటోరియంలో సోమవారం ఏర్పాటు చేసిన ఓపెన్‌ హౌస్‌కు తల్లిదండ్రులు, విద్యార్థుల నుంచి అనూహ్య స్పందన వచ్చింది. ఈ కార్యక్రమాన్ని నిట్‌ డైరెక్టర్‌ బిద్యాధర్‌ సుబుదీ ప్రారంభించి మాట్లాడారు. జోసా ప్రవేశ పరీక్ష ద్వారా ఐఐటీ, ఎన్‌ఐటీల్లో బీటెక్‌ ప్రథమ సంవత్సరంలో అడ్మిషన్‌ పొందేందుకు విద్యార్థులకు, తల్లిదండ్రులకు ఉన్న సందేహాలను నివృత్తి చేసేందుకు ఓపెన్‌ హౌస్‌ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఏమరపాటుతో ఛాయిస్‌ ఫిల్లింగ్‌లో తప్పులు చేస్తే సీటు కోల్పోయే ప్రమాదం ఉందని, జాగ్రత్తగా అడ్మిషన్‌ అప్లికేషన్‌ ప్రక్రియను పూర్తి చేసుకోవాలన్నారు. జోసా ప్రవేశపరీక్ష అర్హత సాధించి బీటెక్‌ ప్రథమ సంవత్సరంలో ప్రవేశాల కోసం కళాశాల, కోర్సుల ఎంపికలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై విద్యార్థులు, తల్లిదండ్రులు.. నిట్‌ ప్రొఫెసర్లతో ముఖాముఖి మాట్లాడారు. కార్యక్రమంలో నిట్‌ డీన్లు, ప్రొఫెసర్లు, విద్యార్థులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.

కోటి మంది మహిళలను

కోటీశ్వరుల్ని చేయడమే లక్ష్యం

హన్మకొండ అర్బన్‌: రాష్ట్రంలో కోటి మంది మహిళా సంఘాల మహిళలను కోటీశ్వరుల్ని చేయాలనే లక్ష్యంతో పలు కార్యక్రమాలు చేపడుతున్నట్లు రాష్ట్ర పంచాయతీ రాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క అన్నారు. సోమవారం హైదరాబాద్‌ నుంచి మంత్రి సీతక్క, సీఎస్‌ రామకృష్ణారావుతో కలిసి బడిబాట, ఇందిరా మహిళా శక్తి కార్యక్రమాలపై కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌లో సమీక్ష నిర్వహించారు. ఇందులో హనుమకొండ కలెక్టరేట్‌ నుంచి హనుమకొండ కలెక్టర్‌ ప్రావీణ్య, అదనపు కలెక్టర్‌ వెంకట్‌రెడ్డి, డీఆర్డీఓ మేన శ్రీను, జిల్లా విద్యాశాఖ అధికారులు, సంబంధిత జిల్లా అధికారులు పాల్గొన్నారు.

పర్యాటక ప్రదేశాలకు

ఆర్టీసీ టూర్‌ ప్యాకేజీ

హన్మకొండ: పర్యాటక ప్రదేశాలు, పుణ్యక్షేత్రాలకు ఆర్టీసీ ప్రత్యేక టూర్‌ ప్యాకేజీని ప్రవేశపెట్టినట్లు టీజీఎస్‌ ఆర్టీసీ వరంగల్‌ రీజినల్‌ మేనేజర్‌ దర్శనం విజయ భాను అన్నారు. సోమవారం హనుమకొండలోని ఆర్టీసీ వరంగల్‌ రీజియన్‌ కార్యాలయంలో ప్రత్యేక టూర్‌ ప్యాకేజీ పోస్టర్లను ఆర్‌ఎం ఆవిష్కరించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వరంగల్‌ రీజియన్‌లోని ఆయా డిపోల నుంచి పర్యాటక ప్రాంతాలు, పుణ్యక్షేత్రాలకు ప్రత్యేక బస్సులు నడుపనున్నట్లు తెలిపారు. హనుమకొండ నుంచి పంచరామాలు, అరుణాచలం, భద్రాచలం, వేములవాడ, నాగార్జునసాగర్‌, బొగత, రామప్ప, లక్నవరం, మల్లూరు, ఇతర పర్యాటక ప్రదేశాలకు బస్సులు నడుపనున్నట్లు వివరించారు. ప్రయాణికులు ఈసౌకర్యాన్ని వినియోగించుకోవాలని కోరారు. ప్రత్యేక టూర్‌ ప్యాకేజీల వివరాల కోసం వరంగల్‌–1 డిపో మేనేజర్‌ 99592 26047, వరంగల్‌–2 99592 26048, హనుమకొండ 89777 81103, పరకాల 99592 26051, నర్సంపేట 99592 26052, భూపాలపల్లి 99592 26707, తొర్రూరు 99592 26053, మహబూబాబాద్‌ 99592 26054, జనగామ డిపో మేనేజర్‌ 99592 26050ను సంప్రదించాలని కోరారు. కార్యక్రమంలో డిప్యూటీ రీజినల్‌ మేనేజర్‌ కేశరాజు భానుకిరణ్‌, అకౌంట్స్‌ ఆఫీసర్‌ రవీందర్‌, పర్సనల్‌ ఆఫీసర్‌ సైదులు, డిపో మేనేజర్లు అర్పిత, వి.జోత్స్న, ధరమ్‌సింగ్‌ పాల్గొన్నారు.

సైన్స్‌ కోర్సుల అసిస్టెంట్‌  డైరెక్టర్‌గా శ్రీనివాస్‌1
1/3

సైన్స్‌ కోర్సుల అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా శ్రీనివాస్‌

సైన్స్‌ కోర్సుల అసిస్టెంట్‌  డైరెక్టర్‌గా శ్రీనివాస్‌2
2/3

సైన్స్‌ కోర్సుల అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా శ్రీనివాస్‌

సైన్స్‌ కోర్సుల అసిస్టెంట్‌  డైరెక్టర్‌గా శ్రీనివాస్‌3
3/3

సైన్స్‌ కోర్సుల అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా శ్రీనివాస్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement