నిట్‌లో క్యాంపస్‌ సెలక్షన్స్‌ | - | Sakshi
Sakshi News home page

నిట్‌లో క్యాంపస్‌ సెలక్షన్స్‌

May 24 2025 1:08 AM | Updated on May 24 2025 1:08 AM

నిట్‌లో క్యాంపస్‌ సెలక్షన్స్‌

నిట్‌లో క్యాంపస్‌ సెలక్షన్స్‌

కాజీపేట అర్బన్‌: నిట్‌ వరంగల్‌ క్యాంపస్‌ 2025 సెలక్షన్స్‌లో 1,201 యూజీ, పీజీ విద్యార్థులు ఉద్యోగాలు సాధించినట్లు నిట్‌ డైరెక్టర్‌ బిద్యాధర్‌ సుబుదీ శుక్రవారం క్యాంపస్‌ సెలక్షన్స్‌ వివరాలు వెల్లడించారు. ప్రపంచ వ్యాప్తంగా ప్రత్యేకతను సాధించుకున్న నిట్‌ వరంగల్‌ క్యాంపస్‌ విద్యార్థులను ఎంపిక చేసుకునేందుకు ఈ ఏడాది 290కి పైగా.. కంపెనీలు పోటీ పడినట్లు తెలిపారు. నిట్‌ వరంగల్‌కు చెందిన 791 అండర్‌ గ్రాడ్యుయేట్‌, 717 మంది పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ విద్యార్థులు పూర్తిగా 1,508 మంది విద్యార్థులు క్యాంపస్‌ సెలక్షన్స్‌కు హాజరుకాగా.. 1,201 మంది వివిధ కంపెనీల్లో ఉద్యోగాలను సాధించారని తెలిపారు. బీటెక్‌లో ఈసీఈ విభాగానికి చెందిన సోమిల్‌ మాల్‌ధాని అత్యధిక ప్యాకేజీ రూ.64.3 లక్షల వార్షిక ప్యాకేజీకి ఎంపిక కాగా.. అత్యల్పంగా రూ.14.35 లక్షల ప్యాకేజీకి, అదే విధంగా పీజీలో రూ.12.20 లక్షల వార్షిక ప్యాకేజీకి ఎంపికై నట్లు తెలిపారు. ఈఏడాది పీహెచ్‌డీ విద్యార్థులు సైతం క్యాంపస్‌ సెలక్షన్లలో పోటీపడగా.. ఆరుగురు పీహెచ్‌డీ విద్యార్థులు క్యాంపస్‌ సెలక్షన్స్‌లో రూ.9 లక్షల వార్షిక ప్యాకేజీకి ఎంపికై నట్లు పేర్కొన్నారు. నిట్‌లో విద్యార్థులకు క్యాంపస్‌ సెలక్షన్స్‌ ఎంపికకు సీపీపీడీ (సెంటర్‌ ఫర్‌ కెరీర్‌ ప్లానింగ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌) ప్రత్యేకంగా పని చేస్తుందని తెలిపారు.

1,201 మందికి ఉద్యోగాలు

రూ.64.3 లక్షల వార్షిక ప్యాకేజీతో సోమిల్‌ మాల్‌దానీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement