అత్తగారింటికి వెళ్లడం లేదని తల్లి మందలించడంతో...  | - | Sakshi
Sakshi News home page

అత్తగారింటికి వెళ్లడం లేదని తల్లి మందలించడంతో... 

Jul 1 2023 1:10 AM | Updated on Jul 1 2023 1:21 PM

- - Sakshi

పెళ్లయిన రెండు రోజులకే అంజలి పుట్టింటికి వచ్చింది.

వరంగల్ : గడ్డిమందు తాగి చికిత్స పొందుతూ నవ వధువు మృతిచెందిన సంఘటన ఏకేతండాలో చోటు చేసుకుంది. ఏఎస్సై సదానందం తెలిపిన వివరాల ప్రకారం.. తండాకు చెందిన మూడు దేవా, శారద దంపతుల పెద్ద కుమార్తె అంజలి (19)ని పర్వతగిరి మండలం రావూరుతండాకు చెందిన శ్రీకాంత్‌కు ఇచ్చి ఇటీవల వివాహం చేశారు. పెళ్లయిన రెండు రోజులకే అంజలి పుట్టింటికి వచ్చింది.

ఈ క్రమంలో ఈనెల 28న అంజలిని ఎందుకు అత్తగారింటికి వెళ్లడం లేదని తల్లి మందలించింది. దీంతో మనస్తాపం చెందిన అంజలి తమ వ్యవసాయ పొలంలోకి వెళ్లి గడ్డిమందు తాగి ఆత్మహత్యకు యత్నించింది. తల్లిదండ్రులు చికిత్స నిమిత్తం ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్సై తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement