దోచుకునేందుకే ‘కాళేశ్వరం’
మదనాపురం: గత బీఆర్ఎస్ ప్రభుత్వం దోచుకునే లక్ష్యంతోనే పాలమూరు–రంగారెడ్డి పథకాన్ని పక్కకు నెట్టి కాళేశ్వరం ఎత్తిపోథలకు రూపకల్పన చేశారని ఎమ్మెల్యే మధుసూదన్రెడ్డి దుయ్యబట్టారు. మండల కేంద్రంలోని మార్కెట్ యార్డులో శుక్రవారం రాత్రి నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ కేసీఆర్, హరీశ్రావు అవినీతికి కుంగిన కాళేశ్వరం సాక్షిగా మిగిలిందని ఎద్దేవాచేశారు. దైవ దర్శనానికి వచ్చిన హరీశ్రావు సంబంధం లేకుండా రాజకీయాలు మాట్లాడడం సరికాదన్నారు. పాలమూరు–రంగారెడ్డి నిర్లక్ష్యానికి నాటి ఇరిగేషన్ మంత్రి హరీశ్రావు ప్రధాన దోషి అని మండిపడారు. సీఎం రేవంత్రెడ్డి రైతు సంక్షేమం కోసం రైతు రుణమాఫీ, రైతు భరోసా, సన్నాలకు బోనస్ చెల్లిస్తున్నారని కొనియాడారు.
నూతన కమిటీల ఎంపికపై కసరత్తు
కాంగ్రెస్ అధిష్టానం ఆదేశాల మేరకు మండల నూతన కమిటీ ఏర్పాటుపై ఎమ్మెల్యే పర్యవేక్షించారు. వివిధ పదవుల కోసం ఆసక్తి చూపుతున్న ఆశావాహుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. పార్టీ కోసం కష్టపడి పనిచేసే వారికే తగిన ప్రాధాన్యం ఉంటుందన్నారు. సమావేశంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ పి.ప్రశాంత్, వైస్ చైర్మన్ తిరుపతిరెడ్డి, డీసీసీ కార్యదర్శి, మదనాపురం ఇన్చార్జ్ తులసీరాజుయాదవ్, కురుమూర్తిరాయ లిఫ్ట్ చైర్మన్ రాజవర్ధన్రెడ్డి, ఎన్ఎస్యూఐ నాయకులు కృష్ణవర్ధన్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
కస్తూర్బా కళాశాలలో డ్రెయినేజీ లేక ఇబ్బంది
పట్టించుకోని పాలకులు, అధికారులు
పరిష్కరించాలని వేడుకుంటున్న స్థానికులు


