● ప్రభుత్వ నిర్ణయంతో లబ్ధిదారుల్లో ఆందోళన
● ఇదెక్కడి తీరు అంటూ నిట్టూర్పు
● ఈకేవైసీకి దూరంగా వేలాది మంది
విజయనగరం ఫోర్ట్:
ఈకేవైసీ చేయించుకోని రేషన్ కార్డు (రైస్కార్డు) లబ్ధిదారులకు రేషన్ సరుకులు నిలిపివేతకు ప్రభుత్వం నిర్ణయించింది. ఇది జిల్లాలో ఈకేవైసీ చేయించుకోని లబ్ధిదారులను కలవరపెడుతోంది. ఈ నెలఖారులోగా ఈకేవైసీ తప్పనిసరిగా చేయించుకోవాలి. లేనిపక్షంలో రేషన్ కార్డు ఆధారంగా పొందే అన్ని పథకాలు నిలిచిపోనున్నాయి. ప్రభుత్వ పథకాలకు రేషన్ కార్డునే ప్రామాణికంగా తీసుకుని లబ్ధిదారులను ఎంపిక చేస్తున్నారు. అయితే, రేషన్ కార్డు లబ్ధిదారులకు అవగాహన లేక, అలసత్వం వల్ల వేలాది మంది ఇంతవరకు ఈకేవైసీ చేయించుకోలేదు. వీరు మేలుకోకుంటే రేషన్ సరుకులు అందేపరిస్థితి లేదు.
మండలాలు వారీగా ఈకేవైసీ చేయించుకోవాల్సిన
లబ్ధిదారుల సంఖ్య ఇలా..


