రైతు శ్రేయస్సుకు పెద్దపీట అంటున్న యంత్రాంగం సీజన్కు ముందే సమస్యలు పరిష్కరించకుంటే ఎలా? గత ఏడాది తోటపల్లి కాలువల పరిధిలో లస్కర్లు, డిస్ట్రిబ్యూటరీ చానల్స్, షట్టర్ల మరమ్మతులు, నీటి సరఫరాకు సంబంధించి అధికారులకు విన్నవించాం. పాలకొండలో సబ్కలెక్టర్, ఇరిగేషన్ అధికారులతో రైతుల సమన్వయ సమావేశం నిర్వహించి సమస్యలు విన్న అధికారులు ఇప్పటి వరకూ ఎటువంటి చర్యలూ తీసుకోలేదు. రాయితీలు అంతంత మాత్రమే, స్వల్పకాలిక విత్తనాలు వేయమంటున్నారు. ఎరువులు, యూరియా కొరత వేధిస్తోంది. ఈ క్రమంలో మదుపులు పెరిగాయి.
కండాపు ప్రసాదరావు,
అభ్యుదయ రైతు, రుద్రిపేట..


