భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జయంతిని మంగళవారం వాడవాడలా నిర్వహించారు. ఆయన విగ్రహాలు, చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అంబేడ్కర్ అందరివాడని, బడుగు బలహీన వర్గాలకు రాజ్యాంగంతో బాసట కల్పించారని ప్రజాప్రతినిధులు, అధికారులు పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ రాజ్యాంగ స్ఫూర్తితో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. అందరికీ రాజ్యాంగంలో సమాన హక్కులు కల్పించారన్నారు. – సాక్షి నెట్వర్క్
విజయనగరంలో అంబేడ్కర్ చిత్రపటం వద్ద నివాళులర్పిస్తున్న ఏపీ శాసన సభ మాజీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి


