ఘనంగా మిస్టర్‌ ఆంధ్ర పోటీలు ప్రారంభం | - | Sakshi
Sakshi News home page

ఘనంగా మిస్టర్‌ ఆంధ్ర పోటీలు ప్రారంభం

Sep 29 2025 11:54 AM | Updated on Sep 29 2025 11:54 AM

ఘనంగా మిస్టర్‌ ఆంధ్ర పోటీలు ప్రారంభం

ఘనంగా మిస్టర్‌ ఆంధ్ర పోటీలు ప్రారంభం

ఘనంగా మిస్టర్‌ ఆంధ్ర పోటీలు ప్రారంభం

విజయనగరం గంటస్తంభం: పట్టణంలోని ఆనంద గజపతి కళాక్షేత్రం వేదికగా కనకల ఎర్రయ్య మె మోరియల్‌ మిస్టర్‌ ఆంధ్రా రాష్ట్రస్థాయి బాడీబిల్డింగ్‌ పోటీలు వైభవంగా ఆదివారం ప్రారంభమయ్యాయి. విజయనగరం జిల్లా బాడీబిల్డర్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పోటీల్లో రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు చెందిన క్రీడాకారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాడీబిల్డింగ్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు కనకల కృష్ణ మాట్లాడుతూ, కనకల ఎర్రయ్య జ్ఞాపకార్థం ఈ ఏడాది 12వ మిస్టర్‌ ఆంధ్రా బాడీబిల్డింగ్‌ పోటీలను నిర్వహిస్తున్నామని తెలిపారు. దసరా, పైడితల్లి అమ్మవారి ఉత్సవాల సందర్భాన్ని పురస్కరించుకుని ఈ పోటీలను నిర్వహించడం విశేషమన్నారు. ఈ సారి మొత్తం 164 మంది క్రీడాకారులు పోటీల్లో తమ ప్రతిభను ప్రదర్మించారని వెల్లడించారు. విజేతలకు రూ.1.30 లక్షల నగదు ప్రోత్సాహకంతో పాటు బహుమతులు అందజేయనున్నట్లు తెలిపారు. క్రీడాకారులందరికీ తగిన వసతులు కల్పించామని, ఈ పోటీల ద్వారా విజయనగరం ప్రతిష్ఠను రాష్ట్రవ్యాప్తంగా చాటుకోవడమే లక్ష్యమని అసోసియేషన్‌ నాయకులు తెలపారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్‌ ప్రతినిధులు, కార్యదర్శి బైక్‌ రమేష్‌, నాయకులు పిన్నింటి సూర్యనారాయణ, రాఘవరెడ్డి, రాజేందర్‌ రెడ్డి, జనప్రియ శ్రీనివాస్‌, శ్రీనివాస్‌ వర్మ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement