244 స్టాల్స్‌లో ఎస్‌హెచ్‌జీ ఉత్పత్తుల ప్రదర్శన | - | Sakshi
Sakshi News home page

244 స్టాల్స్‌లో ఎస్‌హెచ్‌జీ ఉత్పత్తుల ప్రదర్శన

Sep 28 2025 6:49 AM | Updated on Sep 28 2025 6:49 AM

244 స్టాల్స్‌లో ఎస్‌హెచ్‌జీ ఉత్పత్తుల ప్రదర్శన

244 స్టాల్స్‌లో ఎస్‌హెచ్‌జీ ఉత్పత్తుల ప్రదర్శన

నేటి నుంచి అఖిలభారత డ్వాక్రా బజార్‌

కలెక్టర్‌ ఎస్‌.రామసుందర్‌ రెడ్డి

విజయనగరం అర్బన్‌: దేశవ్యాప్తంగా ఉన్న స్వయం సహాయక సంఘాల సభ్యులు తయారుచేసిన ఉత్పత్తుల ప్రదర్శనకు అఖిల భారత డ్వాక్రా బజార్‌ వేదికగా నిలవనుందని కలెక్టర్‌ ఎస్‌.రామసుందర్‌రెడ్డి పేర్కొన్నారు. విజయనగరం పట్టణంలో ఆదివారం ప్రారంభం కానున్న ఈ ప్రదర్శనను ప్రజలంతా సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం, దసరా వేడుకలు, విజయనగరం ఉత్సవాల్లో భాగంగా స్థానిక మాన్సాస్‌ గ్రౌండ్స్‌లో ఈ నెల 28 నుంచి అక్టోబర్‌ 8వ తేదీ వరకు అఖిల భారత డ్వాక్రా బజార్‌ కొనసాగుతుందన్నారు. 244 స్టాల్స్‌లో హస్తకళలు, కలంకారీ, చేనేత, వెదురు, ఆర్టిఫీషియల్‌ నగలు, డ్రైఫ్రూట్స్‌, పచ్చళ్లు, జ్యూట్‌బోర్డు ఉత్పత్తులు, నాబార్డు, పోచంపల్లి, గద్వాల్‌ వస్త్రాలు ఈ ప్రదర్శనలో విక్రయిస్తారని తెలిపారు. మన రాష్ట్రం నుంచి 26 జిల్లాల్లోని గ్రామీణ, పట్టణ ప్రాంత స్వయం సహాయక సంఘాలు పాల్గొంటున్నట్టు వెల్లడించారు. సమావేశంలో డీఆర్‌డీఏ పీడీ శ్రీనివాసరావు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement