
కారు ఢీకొని యువకుడి మృతి
విజయనగరం క్రైమ్: నడుచుకుంటూ రోడ్డుపై వెళ్తున్న 20ఏళ్ల యువకుడిని ఓ కారు ఢీ కొట్టడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు. ఈ మేరకు ఎస్సై లక్ష్మీ ప్రసన్నకుమార్ తెలిపారు. విజయనగరంలోని బాలాజీ జంక్షన్ వద్ద గణేష్ (20) అనే యువకుడు నడుచుకుంటూ వెళ్తుండగా వెనక నుంచి వచ్చిన కారు ఆ యువకుడిని ఢీ కొట్టింది. దీంతో కింద పడిన గణేష్ తలకు బలమైన గాయం తగలడంతో ఓ ప్రైవేట్ హాస్పిటల్కు చికిత్స కోసం బంధువులు తరలించారు. అప్పటికే బ్రెయిన్ డెడ్ అవడంతో చికిత్స చేస్తుండగా మృతి చెందాడు.