నేడు ప్రజా సమస్యల పరిష్కార వేదిక | - | Sakshi
Sakshi News home page

నేడు ప్రజా సమస్యల పరిష్కార వేదిక

Sep 22 2025 5:59 AM | Updated on Sep 22 2025 5:59 AM

నేడు ప్రజా సమస్యల పరిష్కార వేదిక

నేడు ప్రజా సమస్యల పరిష్కార వేదిక

విజయనగరం అర్బన్‌: కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో సోమవారం ఉదయం 10 గంటల నుంచి ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించి ప్రజల నుంచి అర్జీ లను స్వీకరించనున్నట్లు కలెక్టర్‌ ఎస్‌.రామసుందర్‌రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. అన్ని శాఖల జిల్లా అధికారులు అందుబాటులో ఉంటారని పేర్కొన్నారు. ప్రజాసమస్యల పరిష్కార వేదికకు తమ వివరాలతో పాటు వారి సమస్యలకు సంబంధించి అర్జీలను అందజేయాలని చెప్పారు. అర్జీదారులు గతంలో ఇచ్చిన అర్జీలకు సంబంధించి స్లిప్పును తీసుకురావాలని సూచించారు. సమస్య పరిష్కారమైనప్పుడు ఫోన్‌కు మెసేజ్‌ వస్తుందని, అర్జీదారులు వారి ఫోన్‌ చెక్‌ చేసుకోవచ్చని చెప్పారు. నోటీసులు, ఎండార్సెమెంట్‌ను వాట్సాప్‌లో అందజేస్తున్నామని, ఎండార్స్‌మెంట్‌ను రిజిస్టర్‌ పోస్ట్‌ ద్వారా సంబంధిత చిరునామాకు పంపిస్తున్నామని చెప్పారు. అర్జీ ఇచ్చేటప్పుడు దానిని కరెక్ట్‌గా పూరించాలన్నారు. రిపీటెడ్‌ అర్జీదారులు పాత రసీదును తీసుకురావాలన్నారు. జిల్లా ప్రజలు పీజీఆర్‌ఎస్‌ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

కాల్‌ సెంటర్‌ 1100 సేవలను వినియోగించుకోవాలి

అర్జీదారులు మీకోసం కాల్‌ సెంటర్‌ 1100 సేవలను వినియోగించుకోవాలని కలెక్టర్‌ సూచించారు. అర్జీదారులు వారి అర్జీలు నమోదు చేసుకోవడానికి మీకోసం.ఏపీ.జీఓవీ.ఐఎన్‌’ వెబ్‌సైట్‌ను సంప్రదింవచ్చని సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement