
గడువు దాటక ముందే పరిష్కరించాలి
● కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ● పీజీఆర్ఎస్కు 167 వినతులు
విజయనగరం అర్బన్:
ప్రజావినతుల పరిష్కార వేదికకు వచ్చే వినతులను లాగిన్లో అధికారులు ఎప్పటికప్పుడు చూడాలని ఇంకనూ చూడవలసిన కాలమ్లో ఎప్పుడు చూసినా సున్నా కనపడాలని కలెక్టర్ డాక్టర్ బీఆర్అంబేడ్కర్ అన్నారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన పీజీఆర్ఎస్ కార్యక్రమంలో ప్రజల నుంచి కలెక్టర్ వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా అధికారులతో మాట్లాడుతూ ప్రతిరోజూ లాగిన్ అయిన అధికారులు వినతులను చూడాలని అలాగే రీ ఓపెన్ కేసులు కూడా పూర్తిగా విచారణ చేసి ముగించాలని తెలిపారు. గడువులోగా వినతులకు సమాధానాలు పంపాలని లేని ఎడల సంబంధిత అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. కలెక్టర్తో పాటు సంయుక్త కలెక్టర్ సేతు మాధవన్, డీఆర్ఓ శ్రీనివాసమూర్తి, డిప్యూటీ కలెక్టర్లు వెంకటేశ్వరరావు, ప్రమీలా గాంధీ, మురళి ప్రజల నుంచి వినతులు 167 వినతులు స్వీకరించారు.
ఎస్పీ గ్రీవెన్స్ సెల్కు 20 ఫిర్యాదులు
విజయనగరం క్రైమ్: జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 20 ఫిర్యాదులు వచ్చాయి. కార్యాలయానికి ఫిర్యాదుతో వచ్చిన ప్రతి బాధితుడి ఆవేదనను ఎస్పీ వకుల్ జిందల్ అడిగి తెలుసుకున్నారు. వారి ముందే సంబంధిత స్టేషన్ హౌన్ ఆఫీసర్కు ఎస్పీ ఫోన్ చేసి వివరాలు కనుక్కున్నారు. వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడి, ఫిర్యాదుదారుల సమస్యలను సంబంధిత ఎస్హెచ్ఓలకు వివరించారు. ఫిర్యాదుదారుల సమస్యల పట్ల సానుకూలంగా స్పందించాలని, చట్ట పరిధిలో చర్యలు చేపట్టి, బాధితులకు న్యాయం చేయాలని ఎస్పీ వకుల్ జిందల్ ఆదేశించారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ పి.సౌమ్యలత, ఎస్బీ సీఐ ఏవీలీలారావు, డీసీఆర్బీ సీఐ బి.సుధాకర్, ఎస్సై రాజేష్ సిబ్బంది పాల్గొన్నారు.

గడువు దాటక ముందే పరిష్కరించాలి