సముద్ర భద్రతలో నావికాదళ పాత్ర అభినందనీయం | - | Sakshi
Sakshi News home page

సముద్ర భద్రతలో నావికాదళ పాత్ర అభినందనీయం

Apr 29 2026 8:24 AM | Updated on Apr 29 2026 8:24 AM

సింథియా: భారత నౌకాదళ కార్యాచరణ సామర్థ్యాలను తెలుసుకునేందుకు నౌకాదళ యుద్ధ నౌకను, జలాంతర్గామిని నాగాలాండ్‌ ముఖ్యమంత్రి నైఫియు రియో సందర్శించారు. ఈ సందర్భంగా తూర్పు నావికాదళ కమాండ్‌ ఉన్నతాధికారులు ఆయనకు ఘనస్వాగతం పలికారు. పర్యటనలో భాగంగా, ఉపరితల, జలాంతర్గత వేదికల విధులు, లక్ష్యాలు, కార్యాచరణ సామర్థ్యాల గురించి అధికారులు ఆయనకు వివరించారు. అనంతరం, ఆయన ఆ నౌకలను పరిశీలించారు. నైఫియు రియో నౌకాదళ సిబ్బందితో సంభాషించి, దేశ సముద్ర ప్రయోజనాలను పరిరక్షించడంలో వారు ప్రదర్శిస్తున్న వృత్తి నైపుణ్యం, అంకితభావం, నిబద్ధతను ప్రశంసించారు. భారత నౌకాదళం పాటిస్తున్న ఉన్నత ప్రమాణాలను, సముద్ర భద్రతను నిర్ధారించడంలో నౌకల పాత్రను ఆయన కొనియాడారు.

Advertisement
 
Advertisement
Advertisement