ఏయూ శతాబ్ది ముగింపు వేడుకల ఏర్పాట్లపై కలెక్టర్ ఎం. అభిషిక్త్ కిశోర్, వీసీ జీపీ రాజశేఖర్తో కలిసి కమాండ్ కంట్రోల్ రూమ్లో సమీక్షించారు. కార్యక్రమ షెడ్యూల్ను నిమిషాల వారీగా అమలు చేయాలని, సాంస్కృతిక కార్యక్రమాలు ఆటంకం లేకుండా జరగాలని ఆదేశించారు. అతిథులు, విద్యార్థులకు తాగునీరు, స్నాక్స్, పారిశుధ్యం, పార్కింగ్ సదుపాయాలు పక్కాగా ఉండాలని సూచించారు. వీవీఐపీల భద్రతకు అంబులెన్సులు, హెల్ప్ డెస్క్లు సిద్ధం చేయాలని ఆదేశించిన కలెక్టర్, అంతకుముందు ఏయూ ప్రాంగణం, తర్లువాడలోని ఏర్పాట్లను సీపీ శంఖబ్రత బాగ్చి, సీఎం కార్యక్రమాల నిర్వహణ సమన్వయకర్త పెందుర్తి వెంకటేష్, జాయింట్ కలెక్టర్ గొబ్బిళ్ల విద్యాధరి పరిశీలించారు.


