ప్రభుత్వాలు విద్యా, వైద్య రంగాలను పూర్తిగా ప్రైవేటీకరిస్తూ వ్యాపార కేంద్రాలుగా మార్చేస్తున్నాయి. ఈ విధానాల వల్ల రాష్ట్రం తిరోగమనం వైపు పయనిస్తోంది. విశ్వవిద్యాలయాల్లో జరిగే పరిశోధనలు కేవలం పట్టాలకే పరిమితం కాకుండా సమాజానికి, ఈ ప్రాంత అభివృద్ధికి ఉపయోగపడేలా ఉండాలి. ప్రభుత్వాలు మారినప్పుడల్లా విద్యా విధానాలను మార్చేయడం సరికాదు. ఒక స్థిరమైన విద్యా విధానం రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
– ఎస్.సుధాకర్, ఏయూ ఆర్ట్స్ అండ్ లా కాలేజీ
విద్యార్థి సంఘం పూర్వ అధ్యక్షుడు


