50 ఏళ్ల భవిష్యత్తు ప్రణాళిక | - | Sakshi
Sakshi News home page

50 ఏళ్ల భవిష్యత్తు ప్రణాళిక

Apr 24 2026 5:50 AM | Updated on Apr 24 2026 5:50 AM

రాబోయే 50 ఏళ్ల అవసరాలను దృష్టిలో ఉంచుకుని రైల్వే స్టేషన్‌ పునరాభివృద్ధి పనులు చేపడుతున్నాం. ఈ స్టేషన్‌ను కేవలం రైళ్లు వచ్చి వెళ్లే ప్రాంతంగానే కాకుండా, నగరానికే తలమానికంగా నిలిచే ఒక భారీ వాణిజ్య, రవాణా కేంద్రంగా తీర్చిదిద్దుతున్నాం. ఈ ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తున్న బహుళ అంతస్తుల భవనాల్లో రైల్వే కార్యాలయాలతో పాటు.. అత్యాధునిక వెయిటింగ్‌ హాల్స్‌, విశ్రాంతి గదులు, విశాలమైన వాణిజ్య సముదాయాలను ఏర్పాటు చేస్తున్నాం. ఈ పనులన్నీ పూర్తయితే, విశాఖపట్నం రైల్వే స్టేషన్‌ దక్షిణ భారతదేశంలోనే ఒక ప్రధాన రవాణా కేంద్రంగా అవతరించి, నగర కీర్తిని దశదిశలా చాటుతుంది.

– లలిత్‌ బోహ్రా, వాల్తేరు డీఆర్‌ఎం

Advertisement
 
Advertisement
Advertisement