కూటమి ప్రభుత్వం విశాఖలోని భూములను ఎకరం కేవలం 99 పైసలకే కట్టబెడుతోంది. మేయర్ను మార్చింది కూడా ఇలాంటి అక్రమ కార్యకలాపాల కోసమేనని అర్థమవుతోంది. క్రీడా ప్రాంగణాల వద్ద బ్యానర్లు ఏర్పాటు చేసి వాకర్ల దగ్గర వసూళ్లకు పాల్పడుతోంది. బెల్ట్ షాపులను ప్రోత్సహిస్తూ రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తోంది. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎప్పుడూ తప్పులను సహించలేదు. వేలాది మంది కార్మికుల జీవితాలతో ముడిపడిన స్టీల్ ప్లాంట్ నిర్వీర్యమవుతుంటే మొద్దు నిద్రపోతున్న చంద్రబాబు ప్రభుత్వం, ప్రైవేటు సంస్థలకు భూములు అప్పగించేందుకు మాత్రం తాపత్రయపడుతోంది.
– తిప్పల దేవన్ రెడ్డి, గాజువాక సమన్వయకర్త


