గీతం సంస్థ తన రాజకీయ పలుకుబడిని వాడుకుంటూ విద్యను వ్యాపారంగా మార్చి దోచుకుంటోంది. విద్యార్థుల తల్లిదండ్రులు అప్పులు చేసి ఫీజులు కడుతున్నా, ఈ సంస్థ ఎప్పుడూ స్థానికులకు ఉచిత సీట్లు కేటాయించలేదు. వైఎస్సార్ సీపీ హయాంలో ఆక్రమిత భూములను రక్షించే ప్రయత్నం చేస్తే కోర్టుల నుంచి స్టే తెచ్చుకుని కాలక్షేపం చేశారు. ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం రాగానే జీవీఎంసీలో అక్రమంగా తీర్మానాలు చేయించుకుని నిర్మాణాలకు తెరదీశారు.
– ఉరుకూటి చందు, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు


