సింహాచలం: సింహగిరిపై చందనోత్సవం ఏర్పాట్లను రాష్ట్ర దేవదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, జిల్లా ఇన్చార్జి మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి శనివారం పరిశీలించారు. ఆలయ నీలాద్రిగుమ్మం వద్ద ఏర్పాటుచేసిన ర్యాంపులపై నిలబడి భక్తులకు స్వామివారి మూలవిరాట్ సరిగ్గా కనిపిస్తున్నారా...లేదా.. అని పరిశీలించారు. నీలాద్రిగుమ్మం వద్ద నుంచే భక్తులందరికీ లఘు దర్శనం ఇస్తుండటంతో భక్తులు ఏయే లైన్లలో వెళ్తారో ఆరా తీశారు. ఈ సందర్భంగా స్వామిని మంత్రులు దర్శించుకున్నారు. ఎమ్మెల్యేలు విష్ణుకుమార్రాజు, అదితి గజపతిరాజు, దేవదాయశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ హరిజవహర్లాల్, కమిషనర్ రామచంద్రమోహన్, కలెక్టర్ అభిషిక్త్ కిశోర్ తదితరులు ఉన్నారు. పంచగ్రామాల భూసమస్య పరిష్కారం కోసం ప్రభుత్వం తరపున అన్ని చర్యలు తీసుకుని ఆ వివరాలను హైకోర్టు ముందు ఉంచామని, మంత్రి ఆనం తెలిపారు.


