ఇది గీతం యూనివర్శిటీ నుంచి గీతం మెడికల్ కాలేజీకి వెళ్లేందుకు నిర్మించిన అండర్ వే బ్రిడ్జి. దీనిని ఎండాడ నుంచి రుషికొండకు వెళ్లే ప్రధాన రహదారి కింద గీతం యాజమాన్యం అక్రమంగా నిర్మించుకుంది. ప్రభుత్వం నుంచి తీసుకున్న భూములతోపాటు అదనంగా భూములను ఆక్రమించుకుని అనుమతులు లేకుండా ఇష్టారాజ్యంగా నిర్మాణాలు చేపట్టింది. కబ్జా చేసిన రూ.5 వేల కోట్ల విలువ చేసే ప్రభుత్వ భూములను తిరిగి తమ గుప్పిట్లోకి తెచ్చుకునేందుకు దౌర్జన్యానికి దిగుతున్న గీతం యాజమాన్యం... ఇప్పటికే భూముల్లో పార్కింగ్ కోసం చదును చేసి నిర్మాణాలు చేపట్టేందుకూ సిద్ధమవుతుండటం గమనార్హం.


