మురళీనగర్: థాయిలాండ్లో ఈ నెల 5 నుంచి 8వ తేదీ వరకు నిర్వహించిన 30వ థాయిలాండ్ మాస్టర్స్ అథ్లెటిక్స్ ఇంటర్నేషనల్ మీట్లో విశాఖపట్నానికి చెందిన వెటరన్ అథ్లెటిక్స్ తమ ప్రతిభను చాటారు. ఈ పోటీల్లో పాల్గొన్న 13 మంది అథ్లెట్స్ మొత్తం 12 పతకాలు సాధించి సత్తా చాటారు. వీటిలో 3 బంగారు, 4 రజిత, 5 కాంస్య పతకాలు ఉన్నాయని వైజాగ్ వెటరన్ అథ్లెట్స్ అసోసియేషన్ సమన్వయకర్త సీహెచ్. శ్రీనివాసరాజు తెలిపారు.
విజేతలు వీరే..
● నగరానికి చెందిన మాజీ పోలీస్ అధికారి డి.వి.ఎస్.భాస్కర్రాజు (75+) విభాగంలో రజిత పతకం సాధించడంతో పాటు 4 ్ఠ400 మీటర్ల రిలేలో కూడా రజిత పతకం గెలుచుకున్నారు.
● జి.సీతారామ్ (50+) 4 ్ఠ100 మీటర్ల పరుగులో కాంస్య పతకం సాధించారు.
● జి.సందీప్ (35+) 1500 మీటర్ల పరుగులో బంగారు పతకం, 800 మీటర్ల పరుగులో కాంస్య పతకం, 4 ్ఠ400 మీటర్ల రిలేలో రజిత పతకం గెలుచుకున్నారు.
● ఆర్.మంజునాథ్ (40+) 1500 మీటర్ల పరుగులో కాంస్య పతకం, 4 ్ఠ400 మీటర్ల రిలేలో రజిత పతకం సాధించారు.
● పి.సి.సన్యాసిరావు (85+) 100 మీటర్ల పరుగులో బంగారు పతకం, 200 మీటర్ల పరుగులో బంగారు పతకం, లాంగ్ జంప్లో కాంస్య పతకం, ట్రిపుల్ జంప్లో కాంస్య పతకం గెలుచుకున్నారు.
● బి.వింధ్యరేఖ (65+) 4 ్ఠ400 మీటర్ల రిలేలో రజిత పతకం సాధించారు.
● ఇండియా మాస్టర్స్ అథ్లెటిక్స్ సెక్రటరీ జనరల్, ఇండియా టీమ్ మేనేజర్ డాక్టర్ మంగ వరప్రసాద్ ఆధ్వర్యంలో ఈ అథ్లెట్లు పోటీల్లో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా విజేతలను వావ్ చీఫ్ పేట్రన్ డాక్టర్ కమల్ బయిద్, ట్రస్టీలు శుభోద్ కుమార్, నండూరి రామకృష్ణ, పీఆర్ఓ వంశీ చింతలపాటి, కార్యదర్శి ఎల్వీ సుధాకర్, కోశాధికారి కె.రామారావు అభినందించారు.


