
స్వచ్ఛతా పక్షోత్సవాలు ప్రారంభం
తాటిచెట్లపాలెం: సౌత్ కోస్ట్ రైల్వే జనరల్ మేనేజర్ సందీప్ మాధుర్ స్వచ్చతాహీ సేవా 2025 పక్షోత్సవాలను బుధవారం ప్రారంభించారు. స్వచ్ఛ భారత్ మిషన్ 9వ విడతలో భాగంగా ఈస్ట్ పాయింట్ కాలనీలో ఈ కార్యక్రమం జరిగింది. జీఎం నాయకత్వంలో స్వచ్ఛతా ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గాంధీ జయంతి వరకు 15 రోజులు దేశవ్యాప్తంగా రైల్వే అధికారులు, పౌరులు, స్వచ్ఛంద సంస్థల సహకారంతో ప్రత్యేక క్యాంపెయిన్లు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సౌత్కోస్ట్ రైల్వే ఓఎస్డీ బి. చంద్రశేఖర్, ఆయా విభాగాల అధికారులు పాల్గొన్నారు.