
55 ఏళ్ల తర్వాత అదే జోష్
ఆనందాన్ని పంచిన పూర్వ విద్యార్థుల కలయిక
డాబాగార్డెన్స్: హిందుస్థాన్ షిప్యార్డ్ గాంధీగ్రామ్ హైస్కూల్ 1970–71 బ్యాచ్ పూర్వ విద్యార్థులు ఆత్మీయ కలయికను సోమవారం ఓ ఫంక్షన్ హాలులో నిర్వహించారు. స్నేహితుల దినోత్సవం సందర్భంగా జరిగిన ఈ కార్యక్రమంలో సుమారు 40 మంది విద్యార్థులు కలుసుకున్నారు. 55 ఏళ్ల తర్వాత దేశ విదేశాల్లో ఉన్న పాత మిత్రులంతా ఒకచోట చేరి చిన్ననాటి జ్ఞాపకాలను పంచుకున్నారు. ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఎంవీ రాజశేఖర్ , మళ్ల అన్నపూర్ణ, కర్రి పద్మారావు, పీబీకే ఆనంద్, చైతన్య దళాయి, కె.వేంకటేశ్వరరావు, నండూరి వేంకటేశ్వరరావు పాల్గొన్నారు.