విశాఖలో నర్సుల రాష్ట్ర ద్వైవార్షిక సదస్సు | - | Sakshi
Sakshi News home page

విశాఖలో నర్సుల రాష్ట్ర ద్వైవార్షిక సదస్సు

Aug 3 2025 8:40 AM | Updated on Aug 3 2025 8:40 AM

విశాఖలో నర్సుల రాష్ట్ర ద్వైవార్షిక సదస్సు

విశాఖలో నర్సుల రాష్ట్ర ద్వైవార్షిక సదస్సు

సెప్టెంబర్‌ 19, 20 తేదీల్లో నిర్వహణ

బీచ్‌రోడ్డు: ట్రైన్‌డ్‌ నర్సెస్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా(టీఎన్‌ఏఐ) 31వ రాష్ట్ర ద్వైవార్షిక సదస్సు సెప్టెంబరు 19, 20 తేదీల్లో విశాఖపట్నంలో జరగనుంది. ఈ మేరకు అసోసియేషన్‌ అధ్యక్షురాలు డాక్టర్‌ సి.ఆర్‌. షంషేర్‌ బేగం శనివారం నగరంలోని ఒక హోటల్‌లో సదస్సు పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అసోసియేషన్‌ ప్రతినిధులు మాట్లాడుతూ.. ‘లెర్నింగ్‌ టుడే, లీడింగ్‌ టుమారో–ది జర్నీ ఆఫ్‌ నర్సింగ్‌ స్టూడెంట్‌’అనే అంశంపై ఈ సదస్సు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ, ప్రైవేట్‌ నర్సింగ్‌ కళాశాలల సంయుక్త ఆధ్వర్యంలో బీచ్‌రోడ్డులోని ఏయూ కాన్వొకేషన్‌ సెంటర్‌లో ఈ కార్యక్రమం జరుగుతుందని పేర్కొన్నారు. ఏపీ నర్సెస్‌ అండ్‌ మిడ్‌వైఫరీ కౌన్సిల్‌ రిజిస్ట్రార్‌ ప్రొఫెసర్‌ కె.సుశీల, గవర్నమెంట్‌ కాలేజ్‌ ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ ఎం.సత్యవల్లి, కౌన్సిల్‌ సభ్యురాలు, నర్సింగ్‌ ఎడ్యుకేషన్‌ అధ్యక్షురాలు డి.ఉష పన్నాగవేణి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement