
కరాచీ బేకరీ పేరు తొలగించాలి
ఎంవీపీలో జన జాగరణ సమితి నిరసన
ఎంవీపీకాలనీ : పాకిస్తాన్ మూలాలున్న కరాచీ బేకరీ పేర్లను వెంటనే తొలగించాలని జన జాగరణ సమితి డిమాండ్ చేసింది. ఈ మేరకు సమితి నాయకులు ఎంవీపీ కాలనీ సెక్టార్–2లోని కరాచీ బేకరీ వద్ద సోమవారం నిరసనకు దిగారు. బేకరీ బోర్డు తొలగించేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా బీజేవైఎం జాతీయ కార్యవర్గ సభ్యుడు వంశీయాదవ్ మాట్లాడుతూ పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు అత్యంత కిరాతకంగా భారతీయులను చంపేస్తుంటే దేశంలో పాకిస్తాన్ మూలాలున్న కరాచీ బేకరీల వ్యాపారులు ప్రశాంతంగా ఎలా వ్యాపారాలు సాగిస్తారన్నారు. పాకిస్తాన్ మూలాలతో దేశంలో నడుస్తున్న వ్యాపార సంస్థల పేర్లు 10 రోజుల్లో మార్చకపోతే సహించబోమని హెచ్చరించారు. ఇలాంటి వ్యాపారులపై కేంద్రం కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. సమితి రాష్ట్ర కన్వీనర్ ఎస్ఎల్ఎన్ వాసు, నగర కన్వీనర్ చింతపల్లి సునీల్కుమార్, అనిల్, రాజేష్, శీను, అన్వేష్ పాల్గొన్నారు.