
నేడు విశాఖ–కిరండూల్ పాసింజర్ రద్దు
తాటిచెట్లపాలెం: కొత్తవలస–కోరాపుట్ సెక్షన్ తైడ–చిమిడిపల్లి పరిధిలో ట్రాక్ పునరుద్ధరణ పనులు యుద్ధ ప్రాతిపదికన కొనసాగుతున్నాయి. బుధవారం ఇక్కడ గూడ్స్ రైలు పట్టాలు తప్పిన విషయం తెలిసిందే. వాల్తేర్ డివిజనల్ రైల్వే మేనేజర్ లలిత్ బోరా, ఏడీఆర్ఎం(ఇన్ఫ్రా) ఈ.శాంతారం స్వయంగా పనులను పర్యవేక్షిస్తున్నారు. పునరుద్ధరణ పనుల కారణంగా ఈ మార్గంలో ప్రయాణించే రైళ్లను శుక్రవారం రద్దు చేసినట్లు వాల్తేర్ డివిజన్ అధికారులు తెలిపారు.
రద్దయిన రైళ్లు : విశాఖపట్నం–కిరండూల్(58501) పాసింజర్, కిరండూల్–విశాఖపట్నం(58502) పాసింజర్, కిరండూల్–విశాఖపట్నం(18516) నైట్ ఎక్స్ప్రెస్.