
సంద్రం.. కల్లోలం
● నిన్న ఇసుక.. నేడు రాళ్లు.. రేపు.?
గురువారం
ఇలా
బుధవారం
నాటి పరిస్థితి
సాగరతీరంలో కొన్ని గంటల్లో చోటుచేసుకున్న అనూహ్యమైన మార్పులు ఆందోళన కలిగిస్తున్నాయి. అంబికా సీ గ్రీన్ హోటల్ ఎదురుగా ఉన్న బీచ్ రోడ్డు ప్రాంతంలో బుధవారం కనిపించిన దృశ్యం.. ఒక్క రాత్రిలోనే పూర్తిగా మారిపోయింది. నిన్నటి వరకు ఇసుక మేటలతో నిండి ఉన్న ఈ ప్రాంతం.. గురువారం ఉదయానికి కెరటాల తీవ్రతకు ఇసుకంతా కొట్టుకుపోయింది. ఇప్పుడు అక్కడ గతంలో వేసిన రాళ్లు దర్శనమిస్తున్నాయి. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే మరో రెండు రోజుల్లో తీరంలోని కొబ్బరి వనాలకు కూడా తీవ్రమైన ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది. గతంలోనూ ఇదే ప్రాంతం భారీగా కోతకు గురైన విషయం తెలిసిందే. అప్పట్లో అధికారులు యుద్ధ ప్రాతిపదికన మట్టి, రాళ్లు డంపింగ్ చేసి తాత్కాలికంగా కోతను నివారించారు. అయితే ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు మరింత ఆందోళనకరంగా ఉన్నాయి. అధికారులు తక్షణమే స్పందించి, తగిన చర్యలు చేపట్టాలని పర్యాటకులు కోరుతున్నారు. – ఏయూ క్యాంపస్
తేమతో నిండిన బీచ్రోడ్డు

సంద్రం.. కల్లోలం

సంద్రం.. కల్లోలం

సంద్రం.. కల్లోలం