జీసీసీ విశ్రాంత అధికారి 15 ఏళ్ల పోరాటం | - | Sakshi
Sakshi News home page

జీసీసీ విశ్రాంత అధికారి 15 ఏళ్ల పోరాటం

May 6 2025 1:06 AM | Updated on May 6 2025 1:06 AM

జీసీసీ విశ్రాంత అధికారి 15 ఏళ్ల పోరాటం

జీసీసీ విశ్రాంత అధికారి 15 ఏళ్ల పోరాటం

మహారాణిపేట: గిరిజన కో–ఆపరేటివ్‌ కార్పొరేషన్‌(జీసీసీ)లో అధికారిగా పనిచేసిన తాను 15 ఏళ్ల కిందట ఉద్యోగ విరమణ చేశానని, నేటికీ జీసీసీ యాజమాన్యం తనకు రిటైర్‌మెంట్‌ బెనిఫిట్స్‌ ఇవ్వలేదని శేఖర మంత్రి ఆదినారాయణ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన సోమవారం కలెక్టర్‌ కార్యాలయంలో జరిగిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో కలెక్టర్‌ ఎం.ఎన్‌.హరేందిర ప్రసాద్‌కు ఫిర్యాదు చేశారు. అనంతరం ఆదినారాయణ మీడియాతో మాట్లాడుతూ.. తాను గతంలో జీసీసీలో ఫైనాన్స్‌ జనరల్‌ మేనేజర్‌గా పని చేసినప్పుడు ఆదాయ పన్ను శాఖ నుంచి పన్ను చెల్లింపు కోసం పలుసార్లు నోటీసులు వచ్చాయన్నారు. తాము కొన్న అటవీ ఉత్పత్తులను అమ్మే వ్యాపారుల వద్ద ట్యాక్స్‌ కలెక్షన్‌ ఎట్‌ సోర్స్‌(టీసీఎస్‌) వసూలు చేయలేదని, అందువల్ల అప్పుడు తమకు ఐటీ శాఖ రూ.1.35 కోట్లు ఫైన్‌ వేసిందన్నారు. అప్పుడు జీసీసీ ఫైనాన్స్‌ జీఎంగా ఉన్న తాను తమ ట్యాక్స్‌ కమిషనర్‌ సలహా మేరకు.. అన్ని మినహాయింపులు పోను మిగిలిన రూ.39 లక్షలను ఐటీ శాఖకు కట్టినట్లు వివరించారు. అయితే ఈ అంశాన్ని అప్పటి జీసీసీ పరిపాలన బోర్డుకు నివేదించినా వారు తన విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఫలితంగా తనకు రావాల్సిన రిటైర్‌మెంట్‌ బెనిఫిట్స్‌ను 15 ఏళ్లుగా ఆపేశారని, సమస్యను పరిష్కరించి తనకు న్యాయం చేయాలని ఆదినారాయణ కలెక్టర్‌తో పాటు జేసీ మయూర్‌ అశోక్‌ను కోరారు.

రిటైర్‌మెంట్‌ బెనిఫిట్స్‌ ఇవ్వడం లేదని

కలెక్టర్‌కు ఫిర్యాదు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement