
త్వరలో చీమలాపల్లి కన్వెన్షన్ సెంటర్ ప్రారంభం
పెందుర్తి: జీవీఎంసీ 95వ వార్డు చీమలాపల్లిలో నిర్మిస్తున్న అధునాతన కన్వెన్షన్ సెంటర్ను అతి త్వరలో ప్రారంభించనున్నామని రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర వెల్లడించారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో విడుదలైన రూ.6.24 కోట్ల వీఎంఆర్డీఎ నిధులతో నిర్మిస్తున్న కన్వెన్షన్ సెంటర్ను సోమవారం ఆయన పరిశీలించారు. 2022లో ప్రారంభమైన పనులు ప్రస్తుతం తుది దశకు వచ్చాయని అధికారులు మంత్రికి వివరించారు. మిగిలిన పనులు త్వరగా పూర్తి చేయాలని మంత్రి సూచించారు. ఏపీ ఆయిల్ఫెడ్ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీ, కార్పొరేటర్లు ముమ్మన దేముడు, అధికారులు పాల్గొన్నారు.