ఆరిలోవ ఏఎస్‌ఐ మృతి | - | Sakshi
Sakshi News home page

ఆరిలోవ ఏఎస్‌ఐ మృతి

May 3 2025 8:33 AM | Updated on May 3 2025 8:33 AM

ఆరిలోవ ఏఎస్‌ఐ మృతి

ఆరిలోవ ఏఎస్‌ఐ మృతి

ఆరిలోవ: ఆరిలోవ పోలీస్‌స్టేషన్‌ ఏఎస్‌ఐగా విధులు నిర్వర్తిస్తున్న రమణ మరణించారు. అప్పుఘర్‌లో నివాసం ఉంటున్న ఆయన గత నెల 30న జరిగిన చందనోత్సవంలో విధులు నిర్వర్తించారు. అనంతరం అస్వస్థతకు గురైన ఆయన సెలవు తీసుకున్నారు. శుక్రవారం ఇంటి వద్ద అతని బైక్‌ స్టాండ్‌ వేస్తుండగా అదుపు తప్పి కిందపడటంతో తలకు తీవ్ర గాయమైంది. వెంటనే కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించేసరికే ఆయన ప్రాణాలు కోల్పోయినట్లు ఆరిలోవ సీఐ హెచ్‌.మల్లేశ్వరరావు తెలిపారు. రమణ గుండె, ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతూ.. రెండేళ్లుగా చికిత్స పొందుతున్నట్లు ఆయన చెప్పారు. రమణకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఆయన పీఎంపాలెం పోలీస్‌ స్టేషన్‌ ట్రాఫిక్‌లో పని చేసి నాలుగేళ్ల కిందట బదిలీపై ఆరిలోవ వచ్చారు. ఇక్కడ లా అండ్‌ ఆర్డర్‌ విభాగంలో విధులు నిర్వహిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement