
అపోలోలో గుండె, పేస్మేకర్ పరీక్షలు ఉచితం
బీచ్రోడ్డు: నేటి జీవన పరిస్థితుల్లో ఆరోగ్యం పట్ల ప్రతి ఒక్కరూ శ్రద్ధ వహించి, ముందుగానే వైద్య పరీక్షలు నిర్వహించుకోవాలని అపోలో ఆసుపత్రి కార్డియాలజీ వైద్య నిపుణులు డాక్టర్ వినీషా సూచించారు. రామ్నగర్లోని అపోలో ఆసుపత్రిలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. ప్రతి ఒక్కరికి చాతీ నొప్పి వచ్చినప్పుడు అది గుండెకు సంబంధించిన సమస్యనా లేదా గ్యాస్ట్రిక్ సమస్యనా అనే ఆలోచన వస్తుందని, ఇకపై ఎలాంటి ఆలోచన లేకుండా నేరుగా అపోలో ఆసుపత్రికి వస్తే ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహిస్తామన్నారు. ఈసీజీ, కొలెస్ట్రాల్, రక్త పరీక్షలు నిర్వహించి సమస్యను నిర్ధారిస్తామని, ఒకవేళ గుండెకు సంబంధించిన సమస్య అయితే ఉచితంగా కార్డియాలజీ నిపుణులతో వైద్య సలహాలు అందిస్తామని వివరించారు. ఇప్పటి వరకు 800 మందికిపైగా ఈ పరీక్షలను ఉచితంగా నిర్వహించినట్లు ఆమె పేర్కొన్నారు. అలాగే డివైస్ క్లినిక్ ఏర్పాటు చేశామని, ఈ క్లినిక్లో పేస్మేకర్ పరీక్షలను ఉచితంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అంతేకాకుండా కేవలం రూ.999లకే జనరల్ హెల్త్ చెకప్ ప్యాకేజీని అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. ఈ అవకాశం ఈ నెల 15వ తేదీ వరకు మాత్రమే అందుబాటులో ఉంటుందని, నగరవాసులు వినియోగించుకోవాలని కోరారు. డాక్టర్ లక్ష్మీనారాయణ, డాక్టర్ టి.రవికాంత్, అడ్మినిస్ట్రేటర్ సందీప్ తదితరులు పాల్గొన్నారు.