బాధిత కుటుంబాలకు భరోసా | - | Sakshi
Sakshi News home page

బాధిత కుటుంబాలకు భరోసా

May 1 2025 1:46 AM | Updated on May 1 2025 1:46 AM

బాధిత కుటుంబాలకు భరోసా

బాధిత కుటుంబాలకు భరోసా

విశాఖ సిటీ: సింహాచలంలో గోడ కూలి మరణించిన వారి కుటుంబ సభ్యులను పరామర్శించడానికి మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి వస్తున్నారన్న వార్త కూటమి ప్రజా ప్రతినిధుల్లో వణుకు పుట్టించింది. జగన్‌ నేరుగా కేజీహెచ్‌కు వచ్చి బాధిత కుటుంబ సభ్యులతో మాట్లాడతారని ముందు షెడ్యూల్‌ రావడంతో వెంటనే మంత్రులు, ఎమ్మెల్యేలు అలెర్ట్‌ అయిపోయారు. కేజీహెచ్‌ మార్చురీ వద్ద హడావుడి చేశారు. మృతదేహాలకు వెంటనే పోస్టుమార్టం నిర్వహించాలని వైద్యాధికారులపై ఒత్తిడి తీసుకువచ్చారు. కుటుంబ సభ్యుల సంతకాలు లేకుండానే పోస్టుమార్టం చేసి తరువాత ఆ తతంగాన్ని పూర్తి చేశారు. మృతదేహాలను కేజీహెచ్‌ నుంచి వారి ఇళ్లకు పంపించే ఏర్పాట్లు చేశారు. వైఎస్సార్‌ సీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి సాయంత్రం 4.50 గంటలకు విశాఖకు వచ్చారు. ఎయిర్‌పోర్టు నుంచి నేరుగా చంద్రంపాలెంలో ఉన్న మృతులు పిల్లా ఉమామహేశ్వరరావు, పిల్లా శైలజ కుటుంబ సభ్యుల ఇంటికి వెళ్లారు. అక్కడ వారికి ఽధైర్యం చెప్పారు. వైఎస్సార్‌సీపీ తరఫున అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. పార్టీ తరఫున మరణించిన వారి కుటుంబాలకు రూ.2 లక్షలు ఆర్థిక సాయాన్ని ప్రకటించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడి ప్రభుత్వ తీరును ఎండగట్టారు. అక్కడి నుంచి విమానాశ్రయానికి చేరుకొని 7.15 గంటలకు విజయవాడకు తిరుగుపయనమయ్యారు. అంతకుముందు మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి విశాఖ విమానాశ్రయంలో పార్టీ శ్రేణులు స్వాగతం పలికారు.

సాయంత్రం విశాఖకు వచ్చిన

మాజీ సీఎం జగన్‌

నేరుగా చంద్రంపాలెంలో బాధిత

కుటుంబం ఇంటికి పయనం

ఆయనను విశాఖకు రానీయకుండా

చేసేందుకు కూటమి విశ్వప్రయత్నాలు

హడావుడిగా పోస్టుమార్టం నిర్వహణ

అయినప్పటికీ బాధిత కుటుంబానికి

ధైర్యం చెప్పిన జగన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement