శాస్త్రోక్తంగా కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం | - | Sakshi
Sakshi News home page

శాస్త్రోక్తంగా కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

Mar 19 2025 1:20 AM | Updated on Mar 19 2025 1:21 AM

శ్రీవారి ఆలయాన్ని శుద్ధి చేస్తున్న

దృశ్యం

రుషికొండలోని శ్రీ మహాలక్ష్మి గోదాదేవి సహిత శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయం(టీటీడీ)లో మంగళవారం ఆలయ శుద్ధి, కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ నెల 20న నిర్వహించనున్న శ్రీవారి ఆలయ తృతీయ వార్షికోత్సవం సందర్భంగా టీటీడీ సంప్రదాయం ప్రకారం ముందుగా వచ్చే మంగళవారం ఈ కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీ. ఈ మేరకు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు సుగంధ ద్రవ్యాలతో శ్రీవారి ఆలయం, హనుమాన్‌, మహాలక్ష్మి, గోదాదేవి ఆలయాలను శుద్ధి చేశారు. మధ్యాహ్నం నుంచి భక్తులకు సర్వదర్శనం కల్పించారు. ఏఈవో జగన్మోహనాచార్యులు, ఇన్‌స్పెక్టర్‌ శివకుమార్‌, ఆలయ అర్చకులు, పండితులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement