ఎరువు.. ధరల దరువు | - | Sakshi
Sakshi News home page

ఎరువు.. ధరల దరువు

Jun 3 2026 6:48 AM | Updated on Jun 3 2026 6:48 AM

ధరలు పెరిగాయి

కొడంగల్‌: వానాకాలం సీజన్‌ సమీపిస్తున్న వేళ ఎరువుల ధరలు భారీగా పెరిగాయి. వర్షాలు కురిస్తే విత్తనాలు వేయడానికి రైతులు సిద్ధం అవుతున్నారు. ఎరువుల ధరలపై నియంత్రణ లేకపోవడంతో రోజు రోజుకు పెరుగుతున్నాయి. విత్తనాలు వేసే సమయంలో భూమిలో శక్తి కోసం వేసే డీఏపీ, కాంప్లెక్స్‌ ఎరువుల ధరలు మండుతున్నాయి. దీంతో సాగు ఖర్చులు పెరిగాయి. రైతు భరోసా పూర్తి స్థాయిలో అందక.. పెట్టుబడి ఎలా అని కర్షకులు ఆందోళన చెందుతున్నారు.

పంట రుణాలకు పెట్టుబడి సాయం

ప్రభుత్వం సాగు పెట్టుబడికి రైతు భరోసా కింద ఎకరాకు రూ.12 వేలు చొప్పున విడుదల చేస్తోంది. ప్రభుత్వం ఇచ్చిన నగదును బ్యాంకర్లు పంట రుణాల్లో జమ చేస్తున్నారు. దీంతో రైతులు పెట్టుబడికి ఇబ్బంది పడుతున్నామని వాపోతున్నారు. ఇప్పటికే రైతులు ఖరీఫ్‌ సీజన్‌కు వ్యవసాయ పనులు ప్రారంభించారు. మార్కెట్‌లో ఎరువుల ధరలు పెరగడంతో ఆందోళన చెందుతున్నారు. సన్న చిన్నకారు రైతులు పెట్టుబడి పెట్టడానికి ఇబ్బంది పడుతున్నారు. నియోజకవర్గంలో ఖరీఫ్‌ సీజన్‌లో సుమారు 50 వేల ఎకరాల్లో రైతులు సాగు చేపట్టనున్నారు. ఖరీఫ్‌ సీజన్‌ ప్రారంభంలో డీఏపీ, కాంప్లెక్స్‌ ఎరువుల ధరలు పెరగడంపై విమర్శలు వస్తున్నాయి. కాంప్లెక్స్‌ ఎరువుల ధరలు ఒక్కో బస్తా ఒక్కో విధంగా ఉంది. వాటి నాణ్యతా ప్రామాణాలను బట్టి ధరను నిర్ణయించారు. కాంప్లెక్స్‌ ఎరువులు ఒక్కో బస్తాపై సుమారు రూ.300 పైగా పెరిగిందని వ్యాపారులు చెబుతున్నారు.

ఎరువుల ధర

డీఏపీ రూ.1,350

కాంప్లెక్స్‌ రూ.2,300

10.26.26 రూ.2,250

యూరియా రూ. 266

ఎస్‌ఏపీ రూ.775

వానాకాలం సాగు సమయంలో రేట్లు ౖపైపెకి

పెట్రోల్‌, డీజిల్‌ పెరిగాయంటూ ఇష్టానుసారంగా పెంపు

ఆందోళనలో రైతులు

విత్తనాల ధరలు

రకం ధర(బస్తాలు)

కిలో కంది రూ.310

జొన్నలు(3కేజీ) రూ.450

వరి రూ.450

పత్తి రూ.810–రూ.900

పెసర రూ.720

గతేడాది కంటే ఈ సంవత్సరం ఎరువుల ధరలు పెరిగాయి. పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరగడంతో ఎరువుల ధరలు పెరిగాయి. రైతులకు ఈ ధరలు ఇబ్బంది కలిగిస్తున్నాయి. ప్రభుత్వం రైతులకు సాగు ఖర్చుల కోసం రైతు భరోసా ఇస్తోంది. ఆ డబ్బుతో ఎరువులు కొనుగోలు ఇబ్బంది తగ్గుతుంది.

– శివకుమార్‌ గుప్తా, కొడంగల్‌

Advertisement
 
Advertisement
Advertisement