పనిచేసే వారికే పదవులు
అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్
ధారూరు: పార్టీ కోసం పనిచేసే వారికి పదవులు వాటంతట అవే వస్తా యని శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్ అ న్నారు. ధారూరు, మోమి న్పేట్కు చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకులు మహ్మద్ బాబా ఖాన్, సిరాజుద్దీన్ ఆదివారం స్పీకర్ ప్రసాద్కుమార్ను మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు. డీసీసీ కార్యదర్శులు మాట్లాడుతూ.. కాంగ్రెస్ అభ్యర్థుల విజయానికి, పార్టీ పటిష్టతకు పాటుపడుతూ వచ్చామనన్నారు. పార్టీ బలోపేతానికి శక్తి వంచన లేకుండా పనిచేస్తామన్నారు. స్పీకర్ను కలిసి వారిలో నాయకులు కల్వ కరణ్కుమార్, తిరుపతిగారి మల్లేశం, సంగమేశ్వర్ తదితరులు ఉన్నారు.


