యాలాల: మండల పరిధిలోని అగ్గనూరు గ్రామానికి చెందిన వ్యాయామ ఉపాధ్యాయుడు(పీడీ) పల్లె భరత్రెడ్డికి ఆర్మీ లెఫ్టినెంట్ హోదా లభించింది. ఉస్మానియా వర్సిటీ పరిధిలోని ప్రైవేటు కళాశాలలో ఎన్సీసీ అధికారిగా విధులు నిర్వహిస్తున్న ఆయన నాగపూర్లో మూడు నెలల పాటు మిలటరీ శిక్షణ పొందారు. ఈ శిక్షణ పూర్తి చేసుకున్న భరత్రెడ్డికి శనివారం లెఫ్టినెంట్ ర్యాంకు కార్డును బ్రిగేడియర్ నిరంజన్ జో అందజేశారు. ఈ సందర్భంగా తెలంగాణ బెటాలియన్ ఏఓ లెఫ్టినెంట్ కల్నల్ మంజుల్ శర్మ భరత్రెడ్డిని అభినందించారు. తనను ప్రొత్సహించిన హైదరాబాద్ గ్రూప్ కమాండర్ కల్నల్ ప్రశాంత్కుమార్, ఏపీ, తెలంగాణ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ నర్సింగ్ శైలానీకి భరత్రెడ్డి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.


