మంచాల: గ్రామంలో తాగు నీటి సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని ఆరుట్ల సర్పంచ్ మానుపాటి శోభ కుమార్ అన్నారు. ఆదివారం గ్రామంలో పర్యటించారు. 40 బోరు బావులను గుర్తించారు.నీటి సమస్య తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ.. వేసవిని దృష్టిలో ఉంచుకొని ముందస్తు చర్యలు తీసుకుంటామని చెప్పారు. అధికారులు, ప్రజల సహకారంతో నీటి వనరులు ఉన్న చోట బోరు బావులకు మోటార్లు బిగిస్తున్నామని తెలిపారు. నీటిని పొందుపుగా వాడుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ నూకం రాజు ముదిరాజ్, వార్డు సభ్యులు పున్నం రాము, బాలమణి, పద్మ, జంగయ్య, మౌనిక, మమత, నాయకులు జానీ పాష, చిందం రఘుపతి, జంగయ్య, పాండు పాల్గొన్నారు.


