మొయినాబాద్రూరల్: కాంగ్రెస్ పార్టీ లేబర్ సెల్ చేవెళ్ల నియోజకవర్గ ప్రధాన కార్యదర్శిగా తోల్కట్ట భానూరి శివశంకర్గౌడ్ నియమితులయ్యారు. ఈ మేరకు బుధవారం రాత్రి నగరంలో నిర్వహించిన కార్యక్రమంలో లేబర్ సెల్ జిల్లా అధ్యక్షుడు ప్రవీణ్కుమార్, నియోజకవర్గ అధ్యక్షుడు సయ్యద్ ఉస్మాన్ అహ్మద్ శివశంకర్గౌడ్కు నియామకపత్రాన్ని అందజేశారు. గురువారం ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్లో కష్టపడిన ప్రతీ ఒక్కరికి ప్రాధాన్యత ఉంటుందన్నారు. తనపై నమ్మకంతో పదవిని కట్టబెట్టిన మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు పామెన జ్యోతిభీమ్భరత్, ప్రవీణ్కుమార్, సయ్యద్ ఉస్మాన్ అహ్మద్, కాంగ్రెస్ చేవెళ్ల నియోజకవర్గ ఇన్చార్జి భీమ్భరత్కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కోరారు.


