ఆలయానికి స్థలం కేటాయించండి
మొయినాబాద్: అయ్యప్ప ఆలయ నిర్మాణానికి స్థలం కేటాయించాలని మండలంలోని పెద్దమంగళారం గ్రామస్తులు, అయ్యప్ప భక్తులు తహసీల్దార్ గౌతమ్కుమార్కు విన్నవించారు. మొయినాబాద్ మున్సిపల్ పరిధిలోని పెద్దమంగళారం సర్వే నంబర్ 218 ప్రభుత్వ భూమిలో అయ్యప్ప దేవాలయం నిర్మాణానికి ఐదు ఎకరాల స్థలాన్ని కేటాయించాలని మంగళవారం స్థానికులు తహసీల్దార్కు వినతిపత్రం అందజేశారు. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని కోరారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు కొంపల్లి అనంతరెడ్డి, పీఏసీఎస్ మాజీ చైర్మన్ జగన్మోహన్రెడ్డి, మాజీ సర్పంచ్ నరోత్తంరెడ్డి, నాయకులు వెంకట్రెడ్డి, వీరారెడ్డి, ఓంరెడ్డి, ఉపేందర్రెడ్డి, అయ్యప్ప భక్తులు ఉన్నారు.


