12 నుంచి పోలేపల్లి ఎల్లమ్మ జాతర | - | Sakshi
Sakshi News home page

12 నుంచి పోలేపల్లి ఎల్లమ్మ జాతర

Jan 21 2026 8:07 AM | Updated on Jan 21 2026 8:07 AM

12 నుంచి పోలేపల్లి ఎల్లమ్మ జాతర

12 నుంచి పోలేపల్లి ఎల్లమ్మ జాతర

దుద్యాల్‌: జిల్లాలో ప్రసిద్ధిగాంచిన పోలేపల్లి రేణుక ఎల్లమ్మ జాతర వచ్చే నెల 12 నుంచి ప్రారంభం కానుందని ఆలయ ఈఓ రాజేందర్‌రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు మంగళవారం గ్రామ సర్పంచ్‌ చంద్రప్ప, గ్రామస్తుల సమక్షంలో నిర్ణయం తీసుకున్నట్లు ఆయన చెప్పారు. మొదట వచ్చే నెల 6 నుంచి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయని ప్రకటించినా కొన్ని అనివార్య కారణాలతో వాయిదా పడిందని వివరించారు. అందుకు తగ్గట్లు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. జాతర ముఖ్య ఘట్టం సిడే లాగుట కార్యక్రమాన్ని ఫిబ్రవరి 13వ తేదీకి సవరించారు. 12న రాత్రి 9 గంటలకు గ్రామంలో ఉన్న అమ్మవారి పూర్వ ఆలయం నుంచి ప్రధాన దేవస్థానం వరకు పల్లకీ సేవ. 13న సాయంత్రం 4 గంటలకు అమ్మవారి సిడే లాగుట(ముఖ్య ఘట్టం). 14న సాయంత్రం రథోత్సవం(తేరులాగుట). 15న అమ్మవారి ప్రత్యేక పూజలు. 16న అమ్మవారిని ఉరేగింపు ప్రధాన దేవాలయం నుంచి గ్రామంలోని ఆలయానికి పంపించుట. ఇలా ఐదు రోజుల్లో బ్రహ్మోత్సవాలు అంగరంగా వైభోవంగా సాగనున్నట్లు చెప్పారు. ఈ ఉత్సవాలకు తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్రాల నుంచి దాదాపు రెండు లక్షలకు పైగా భక్తులు హాజరై అమ్మవారి మొక్కులు చెల్లించుకుంటారు.

ఉత్సవాల తేదీలో మార్పు చేసినట్లు ఈఓ వెల్లడి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement