హత్యకేసులో ముగ్గురికి రిమాండ్‌ | - | Sakshi
Sakshi News home page

హత్యకేసులో ముగ్గురికి రిమాండ్‌

Dec 21 2025 7:00 AM | Updated on Dec 21 2025 7:00 AM

హత్యక

హత్యకేసులో ముగ్గురికి రిమాండ్‌

తాండూరు టౌన్‌: ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను అతి కిరాతకంగా కొట్టి చంపిన కేసులో ముగ్గురికి రిమాండ్‌ విధించినట్లు తాండూరు డీఎస్పీ నర్సింగ్‌ యాదయ్య తెలిపారు. పట్టణంలోని సాయిపూర్‌కు చెందిన పరమేశ్‌, తన భార్య అనూష (20)ను వరకట్నం తీసుకురావాలంటూ గురువారం కర్రతో కొట్టి దారుణంగా హత్య చేసి పరారైన విషయం విదితమే. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు మృతురాలి భర్త పరమేశ్‌, అతని తల్లిదండ్రులు లాలమ్మ, మొగులప్పను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

కీలకంగా మారిన సీసీ పుటేజీ..

ఈ హత్య కేసులో నిందితుడి ఇంటి సమీపంలోని సీసీ కెమెరాలో రికార్డు అయిన పుటేజీ కీలకంగా మారింది. ఈ పుటేజీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గురువారం మధ్యాహ్నం లావుపాటి కర్రతో అనూష తలపై విచక్షణా రహితంగా దాడి చేస్తున్నట్లు నిక్షిప్తమైంది.

హత్యకేసులో ముగ్గురికి రిమాండ్‌ 1
1/2

హత్యకేసులో ముగ్గురికి రిమాండ్‌

హత్యకేసులో ముగ్గురికి రిమాండ్‌ 2
2/2

హత్యకేసులో ముగ్గురికి రిమాండ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement