
తిరుమలనాథుడి సన్నిధిలో అన్నమయ్య కీర్తనలు
పూడూరు: మండల పరిధిలోని పెద్ద ఉమ్మెంతాల్ తిరుమలనాథ స్వామి ఆలయంలో పద్మశ్రీ అవార్డు గ్రహీత డాక్టర్ శోభరాజు బృందం అన్నమయ్య కీర్తనలను ఆలపించారు. విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమంలో భాగంగా గురువారం అన్నమయ్య కీర్తనలు, పలు దైవ సంకీర్తనలు పాడి భక్తులను అలరించారు. ఈ సందర్బంగా శోభరాజు శిశ్యులు రన్వితారెడ్డి, ఆశ్రిత, పద్మశ్రీ చైత్ర, మానస పటేల్, అభిరామ్ తదితరులను ఆలయ పూజారులు సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఆలయ పీఠాధిపతి వెంకటదాసు, ఆలయ ధర్మకర్తలు సంగీత , గోవర్ధన్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.